సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు14: సోమవారం నిర్వహించనున్న స్వాతం త్య్ర దినోత్సవాలకు సంగారెడ్డిలోని జిల్లా పోలీసు పరేడ్ మైదానం ముస్తాబైంది. రాష్ట్ర హోం, జైళ్లు, అగ్నిమాపక శాఖ మంత్రి మహమూద్ అలీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మంత్రి జెండావిష్కరిస్తారు. 10.45 నుంచి 11 గంటల వరకు మంత్రి సందేశం, 11 నుంచి 11.15 గంటల వరకు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు సన్మానం, 11.15 నుంచి 11.30 గంటల వరకు ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖలతో రూపొందించిన శకటాల ప్రదర్శన, 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థానిక విద్యా సంస్థల విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు, మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల వరకు ప్రశంసా పత్రాల పంపిణీ, మధ్యాహ్నం 12.30 నుంచి ఒంటి గంట వరకు మంత్రితో పాటు అతిథితులు, ఆహ్వానితుల స్టాళ్ల ప్రదర్శన ఉంటుంది. వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శనతో పాటు ఆయా శాఖల ప్రదర్శన కోసం స్టాళ్లు ఏర్పాటుచేశారు.