75వ స్వ తంత్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లావ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు(సమైఖ్యత పరుగు) నిర్వహించారు. మెదక్ మండల పరిధిలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీడీవో శ్రీరాములు, రూరల్ ఎస్సై మో హన్రెడ్డి, ఎంపీపీ యమున పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు
ఇంటింటిపై ఎగిరిన జాతీయజెండా
పట్టణ, గ్రామ వీధుల్లో ఊరేగింపులు
మెదక్ రూరల్, ఆగస్టు 13 : 75వ స్వ తంత్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లావ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు(సమైఖ్యత పరుగు) నిర్వహించారు. మెదక్ మండల పరిధిలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీడీవో శ్రీరాములు, రూరల్ ఎస్సై మో హన్రెడ్డి, ఎంపీపీ యమున పాల్గొన్నారు.
పెద్దశంకరంపేట మండలకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎంపీపీ శ్రీ నివాస్, జడ్పీటీసీ విజయరామరాజు పాల్గొన్నారు. హవేళీఘనపూర్లో జ్యోతిబాఫూలే పాఠశాల విద్యార్థినులు ర్యాలీ నిర్వహించా రు. ర్యాలీలో సర్పంచ్ సవిత, డిప్యూటీ తహసీల్దార్ నవీన్, ఎస్సై మురళి, ప్రిన్సిపాల్ రజిని పాల్గొన్నారు. టేక్మాల్ మండలంలోని కుసంగిలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు యూ సుఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
రామాయంపేటలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీసుల కవాతుతోపాటు విద్యార్థులు ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ము న్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, ఎంపీడీవో ఉమాదేవి, ఎస్సై రాజేశ్, వైస్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ భిక్షపతి, కౌన్సిలర్లు పాల్గన్నారు. సుతారిపల్లి, కోనాపూర్ గ్రామాల్లో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.
మనోహరాబాద్, జడ్పీ చైర్పర్సన్ హేమలతాగౌడ్, కాళ్లకల్లో ఎంపీపీ నవనీత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్ ముదిరాజ్, మం డల ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, ఎస్సై రాజుగౌడ్, ఏపీ ఎం పెంటాగౌడ్ పాల్గొన్నారు. నిజాంపేట, చల్మెడలో నిర్వహించిన ర్యాలీల్లో ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఎస్సై శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ నర్సింహరెడ్డి, ఎంపీవో రాజేందర్ ఉన్నారు.
ఉమ్మడి వెల్దుర్తి మండలం వ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో డీఎస్వో శ్రీనివాస్, ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్గౌడ్, ఎస్సై మధుసూదన్గౌడ్, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో జగదీశ్వరాచారి, ఎంఈవో యాదగిరి, హెచ్ ఎం సాంబయ్య, వార్డెన్ శ్రీనివాస్, కస్తూర్బా ఎస్వో ఫాతీమా, పీడీ ప్రతాప్సింగ్, నేతలు నరేందర్రెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటిపై జాతీయజెండాను ఎగురవేయాలని చిలిపిచెడ్ ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, ఎంపీడీవో శశిప్రభ పిలుపునిచ్చారు. శివ్వంపేట మండలంలో జరిగిన ర్యాలీలో జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా, ఎంపీడీవో నవీన్కుమార్, ఎంఈ వో బుచ్యానాయక్, స ర్పంచ్ శ్రీనివాస్గౌడ్, ఎస్సై రవికాంత్రావు పాల్గొన్నారు. ఏదుల్లాపూర్లో మానవ హక్కుల నేత హన్మంతరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
చేగుంట, నార్సింగి మండలాల్లో నిర్వ హించిన ర్యాలీల్లో జడ్పీటీసీ శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి జయరాజ్, ఎస్సై ప్రకాశ్గౌడ్, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ పరమేశ్, ప్రిన్సిపాల్ భూపాల్రెడ్డి పాల్గొన్నారు.
నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ కళాశాలలో 500 మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమం లో ఎస్ఎస్ఎస్ అధికారి దశరథ రామయ్య, కోఆర్డినేటర్ బీమా, జనరల్ మేనేజర్ బాపిరాజు, సీఈవో మనీష పాల్గొన్నారు.