మెదక్ మున్సిపాలిటీ, ఆగస్ట్టు 13 : దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు ప్రాణాలను త్యాగం చేశారు.. అమ రుల త్యాగాలతోనే మనం స్వేచ్ఛా వాయువు పీలుస్తున్నామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల భాగంగా శనివారం మెదక్ మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు విద్యార్థులు, యువకులు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వలంటీర్లు, మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడారు. దేశానికి స్వాతం త్య్రం సిద్ధ్దించి 75 ఏండ్లు గడిచిన సందర్భంగా సమరయోధులను స్మరించుకోవాలన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో ప్రాణాలను త్యాగం చేసి, దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టా రన్నారు. త్యాగధనులు పుట్టిన భారతదేశంలో మనం జన్మించడం గర్వంగా భావించాలన్నారు. పుట్టడం గొప్పకాదు.. సమాజానికి మనవంతు సేవ చేసి జన్మభూమి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు సంస్కృతీ, సంప్రదాయాలు కా పాడుకుంటూ దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
ఎమ్మెల్యే సభావేదికపై ప్రజాప్రతినిధులు, విద్యార్థినులతో కలిసి దేశభక్తి గీతాలకు అనుగుణంగా నృత్యం చేశారు.
మెదక్ పట్టణంలో కిలోమీటర్పైగా ర్యాలీ..
మెదక్ మున్సిపల్ కార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీ కిలోమీటర్ వరకు కొనసాగుతూ జూనియర్ కళాశాల వరకు చేరింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు చేతిలో జాతీయజెండాను పట్టుకొని ర్యాలీ లో పాల్గొన్నారు. సిద్దార్థ పాఠశాల విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణతో పాల్గొన్నారు. పట్టణానికి చెందిన యువకులు ఎస్పీ కార్యాలయం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వజ్రోత్సవ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్డున్గౌడ్, కమిషనర్ శ్రీహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ జగపతి, జిల్లా క్రీడల అధికారి నాగరాజు, డీఎస్పీ సైదులు, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, జయరాజ్, కిశోర్, లక్ష్మీనారాయణగౌడ్, శ్రీనివాస్, సమీయొద్దీన్, ఆంజనేయులు, శేఖర్, ఏఎంసీ డైరెక్టర్ శంకర్, ఆత్మకమిటీ వైస్ చైర్మన్ నారాయణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గణపతి, టీఆర్ఎస్ నాయకులు గంగాధర్, కృష్ణాగౌడ్, లింగారెడ్డి, శివరామకృష్ణ, ఉమర్ పాల్గొన్నారు. పట్టణ సీఐ మధు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వజ్రోత్సవాల్లో జాతీయస్ఫూర్తిని చాటాలి : ఎమ్మెల్యే
చిన్నశంకరంపేట, ఆగస్టు 13 : వజ్రోత్సవాల్లో జాతీయ స్ఫూర్తిని చాటాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సూచించారు. చిన్నశంకరంపేటలో సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మేరీమాత, సాయి విద్యాలయం విద్యార్థులు అతిపెద్ద జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ కొనసాగింది. ప్రతి ఇంటిపై జాతీయజెండాను ఎగురువేశారు. కార్యక్రమంలో ఎం పీడీవో లక్ష్మణమూర్తి, ఎస్సై సుభాశ్గౌడ్, టీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు రాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఐక్యత చాటాలి : ఎమ్మెల్యే మదన్రెడ్డి
నర్సాపూర్, ఆగస్ట్టు 13 : అన్ని మతాలకు భారతదేశం నిల యమని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ, పోలీస్శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో సమైఖ్యతా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ఎమ్మెల్యేతోపాటు డీఎస్పీ యాదవరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గాంధీ విగ్రహం నుంచి నర్సాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. మన దేశంలోనే అన్ని మతాల ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకట ఉపేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, కమిషనర్ చాముండేశ్వరి, సీఐ షేక్లాల్ మదార్, ఎస్సై గంగరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు అశోక్గౌడ్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
తూపాన్ పట్టణంలో ఫ్రీడమ్ ర్యాలీ
తూప్రాన్, ఆగస్టు 13 : పట్టణంలోని పోలీస్స్టేషన్ నుంచి పోతరాజ్పల్లి వరకు ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ పోలీస్స్టేషన్ వద్ద ప్రారంభమై పోతరాజ్పల్లి, నర్సాపూర్ చౌరస్తా వరకుకొనసాగింది. నర్సాపూర్ చౌరస్తా వద్ద త్రివర్ణ బెలూన్లను గాలిలోకి వదిలి జాతీయ సమైఖ్యతను చాటారు. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తూప్రాన్ ము న్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్, తహసీల్దార్ ఆనంద్బాబు, సీఐ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ మోహన్, ఎస్సై సురేశ్ కుమార్, ఆర్ఐలు జై భారత్రెడ్డి, నగేశ్ పాల్గొన్నారు.