మెదక్/సంగారెడ్డి, నెట్వర్క్, ఆగస్టు 10; స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి.. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కనుల పండువగా సాగుతున్నాయి. మూడో రోజూ బుధవారం వన మహోత్సవంలో భాగంగా ఫ్రీడమ్ పార్కులను ప్రారంభించారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటారు. ఆయా చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనగా, సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు ఫ్రీడమ్ పార్కును ప్రారంభించి, మొక్క నాటారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, డీఎస్పీ సైదులు, డీఈవో రమేశ్కుమార్లు, 6వ వార్డు ఫ్రీడమ్ పార్కులో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్లతో కలిసి మొక్కలు నాటారు. సంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ శరత్, జడ్సీచైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యేలు చంటిక్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మహిపాల్రెడ్డి, మాణిక్రావు వేడుకల్లో పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట పట్టణంలోని రంగనాయకసాగర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కును అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సుతో కలిసి మంత్రి ప్రారంభించి, మాట్లాడారు. వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని, ఇవాళ ఫ్రీడమ్ పార్కును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు గాంధీ సినిమాను చూపిస్తున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ వజ్రోత్సాల వేళ జాతీయ జెండాలను అందజేయలేకపోయిందని, దీనికి తోడు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి జాతీయ జెండాలను ఇవ్వలేని పరిస్థితి ఉందని, జాతీయ జెండాలకు బదులుగా కాగితాలు అతికించుకోవాలని చెప్పడం సిగ్గు చేటన్నారు.
ఇదేనా జాతీయ జెండాకు మీరిచ్చే విలువ.. వజ్రోత్సవాలు జరుపుకునే తీరు ఇదేనా అని మంత్రి కేంద్రం తీరును విమర్శించారు. దేశంలో గాంధీని విమర్శిస్తూ గాడ్సెను పొగడుతూ బీజేపీ అనుబంధ సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో 11 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదన్నారు. మేక్ ఇన్ తెలంగాణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కోటి 20 లక్షల జెండాలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నదన్నారు. దేశభక్తి చాటుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ప్రతిపౌరుడు స్వచ్ఛందంగా వేడుకల్లో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్ విజయేందర్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు మేర సత్తయ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మహేశ్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
కే(చే)తనం
ఎన్నో త్యాగాల ఫలం ఎన్నెన్నో బలిదానాల బలం జాతిని ఐక్యం చేసిన రాగం జాతికి స్వేచ్ఛను నిలిపిన యోగంగుండుకు ఎదురుగా గుండెను నిలిపి
గుండె-గుండెల్లో స్వేచ్ఛావాయువు నింపి కదం తొక్కగ భారత జాతీ కని విని ఎరుగని సత్యాగ్రహస్ఫూర్తి బాపు, నెహ్రు, పటేల్, తిలక్ల నీతి బాబు, అంబేద్కర్ చూపిన రాజనీతి సిద్ధించిన స్వపరిపాలన స్థిరపడిపోయిన జాతీకేతన జాగృతమాయెను జగత్తు అంతా జనగణమన అంటూ కేతన చెంత 75 వసంత చిహ్నపు హాయి నింగి నేలను ఏకం చేయాలోయి స్ఫూర్తి నింపగ కేతన పటిమ మూర్తీభవించగా చేతన మహిమ మూడు రంగులతో మురువగ భారతి ముదసలి పడుచు దేశభక్తితో అందించగ హారతి పొందిన దానిని పదికాలలు పొందికగా మరి పదిపది తరాలు అందించే యాగం చేసేద్దాం అందరికి సమంగా పంచేద్దాం
తిరంగా బురుజు
సిద్దిపేట ఆగస్టు 10 : బురుజులు ఆనాటి చరిత్రకు ఆనవాళ్లు.. నాటి చారిత్మ్రాక కట్టడాలను కాపాడుకోవాలనే లక్ష్యంగా మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట పట్టణ నడిబొడ్డున ఉన్న బురుజునకు మువ్వెన్నెలా జెండా రంగులు వేసి, ఆశోక చక్రంతో పెయింటింగ్ వేసి నేటి యువతలో దేశ భక్తిని, జాతీయ సమైక్యతను చాటేలా దానిని సుందరంగా తీర్చిదిద్ది త్రివర్ణ శోభితంగా పునరుద్ధ్దరించారు. దీంతో బురుజు దేశభక్తికి నిలువెత్తు నిదర్శంగా మారిం ది. 2021 జనవరి రిపబ్లిక్ దినోత్సవ వేళ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
ఊరూరు తిరిగి జెప్పినం
అప్పుడప్పుడే వచ్చిన స్వాతంత్య్రం.. ఇంకా జనంలో ఏమి జరిగింది.. భవిష్యత్ ఏమిటి? అని సందేహాలు ఉండేవి. ఈ నేపథ్యంలోనే నాతోటి సహచరులతో కలిసి గజ్వేల్ బ్లాక్ ఏరియాలో ఊరురా తిరిగి స్వాతంత్య్ర సమరయోధుల గురించి బుర్రకథల రూపం లో చెప్పేవాళ్లం. గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు లాంటి పోరాట యోధుల గురించే కాకుండా భూస్వాముల పెత్తందారి పోకడలు, బానిస జీవుల విముక్తి కోసం పోరాడిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, రేణిగుంట రాంరెడ్డి లాంటి వీర యోధులపై కూడా బుర్రకథల ద్వారా ప్రజల్లో విస్తృత ప్రచారం చేశాం.
– టేకులపల్లి రాంరెడ్డి, సీనియర్ సిటిజన్, వర్గల్
మన జెండాను గౌరవిద్దాం..
స్వాతంత్య్రం.. ఎందరో వీరుల త్యాగఫలం.. మరెందరో మహానుభావుల సేవాతత్పరణకు నిదర్శనం.. ఎందరో దేశభక్తుల నిస్వార్థ సేవ.. కొన్ని కోట్ల భారతీయుల ఆకాంక్ష మువ్వన్నెల జెండా. ఈ కల నెరవేరి 75ఏండ్లు కావస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నది. అయితే, జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. పొరపాటు జరుగకుండా చూసుకోవాలి. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చూద్దాం..