చేగుంట/మెదక్రూరల్/శివ్వంపేట/రేగోడ్/నిజాంపేట/ తూప్రాన్/రామాయంపేట, జనవరి 24 : పలు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే చేపడుతున్నారు. సోమవారం మెదక్లోని రాజ్పల్లి, తిమ్మకపల్లి, బచ్చురాజ్పల్లిలోని పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులకు కరోనా టీకాలు వేశారు. పంచాయతీ కార్యదర్శి సబిత, అంగన్వాడీ టీచర్ లక్ష్మీబాయి ఉన్నారు.
విధిగా మాస్క్ ధరించాలి ఎస్సై
ప్రజలందరూ బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ను ధరించాలని రేగోడ్ ఎస్సై సత్యనారాయణ సూచించారు. లేనిచో రూ. వెయ్యి జరిమానా విధిస్తామన్నారు.
తూప్రాన్లో బూస్టర్ టీకాలు
తూప్రాన్ మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు 600 మందికి బూస్టర్ టీకాలు ఇచ్చామని తూప్రాన్ ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ ఆనంద్ అన్నారు. రామాయంపేట మండలం తొనిగండ్ల, రాయిలాపూర్, లక్ష్మాపూర్, అక్కన్నపేట తదితర గ్రామాల్లో ఆరోగ్య సిబ్బందితో పాటు రామాయంపేట ఎంపీడీవో యాదగిరిరెడ్డి, గ్రామ సర్పంచ్ రాణమ్మ, ఎంపీటీసీ నాగులు, రాయిలాపూర్ గ్రామంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నర్సా గౌడ్, ఎంపీటీసీ భాగ్యమ్మ ఆరోగ్య సర్వేలో పాల్గొని కరోనా కిట్లు అందజేశారు.
శివ్వంపేటలో..
ప్రతి ఒక్కరూ టీకాను వినియోగించుకోవాలని శివ్వంపేట ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. ఎంపీపీ కార్యాలయంలో జ్వర సర్వేపై ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నవీన్ కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, వంజరి కొండల్ తదితరులు ఉన్నారు. చేగుంట మండలపరిధిలోని చందాయిపేట గ్రామంలో సోమవారం ఇంటింటా జ్వర సర్వే నిర్వహించారు.