మనోహరాబాద్ /చేగుంట/శివ్వంపేట, జనవరి 24 : నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి అని రాష్ట్ర మహి ళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన బానగారి మైసమ్మ అనారోగ్యానికి గురికాగా, మంజూరైన రూ. 60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును మైసమ్మ భర్త బానగారి సత్తయ్యకు గోమారంలోని ఆమె నివాసంలో అందజేశారు. ఆమెవెంట మాజీ వైస్ ఎంపీపీ హనుమంతురెడ్డి, మహిపాల్రెడ్డి ఉన్నారు.
చేగుంటలో…
చేగుంట మండల పరిధిలోని వడియారం గ్రామానికి చెందిన దాసరి రాజయ్య, పోన్నయ సత్తయ్య ఇటీవల అనారోగ్యానికి గురై సీఎం సహాయనిధికి దరఖాస్త్తు చేసుకోగా, మంజూరైన రూ.28వేలు, పొన్న సత్తయ్యకు రూ.45 చెక్కులను బాధిత కుటుంబాలకు సోమవారం చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్,జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్ అందజేశారు. వారివెంట రాంపూర్ సర్పంచ్ కాశబోయిన భాస్కర్, నాయకులు వడ్డెపల్లి నర్సింహులు,బక్కి రమేశ్ ఉన్నారు.
మనోహరాబాద్లో..
ఆపత్కాలంలో నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ నిలుస్తున్నదని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్గౌడ్ అన్నారు. తూప్రాన్లోని ఒకటో వార్డుకు చెందిన మల్దార్ అంకుశ్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన రూ. 1,50,00 వేల చెక్కును బాధిత కుటుంబీకులకు ఆయన అందజేశారు.