నర్సాపూర్, జూలై25: బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ మున్సిపాలిటీలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ము న్సిపల్ చైర్మన్ మురళీయాదవ్తో కలిసి పాల్గొన్నారు. పట్టణంలోని నల్లపోచమ్మ, దుర్గమ్మ, భూలక్ష్మమ్మ, శీతలమాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దయవల్ల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఫలహారం బండ్ల ఊరేగింపును ఎమ్మెల్యే ప్రారంభించి, నృత్యం చేస్తు అందరిని ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, ఏఎమ్సీ వైస్చైర్మన్ హబీబ్ఖాన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు రమేశ్యాదవ్, నగేశ్, ఆంజనేయులుగౌడ్, కృపాచారి, కౌన్సిలర్లు, భక్తులు పాల్గొన్నారు.
తూప్రాన్లో ఘనంగా రెండోరోజు జాతర
తూప్రాన్, జూలై 25 : మున్సిపల్ కేంద్రంలో రెండో రోజు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబా ద్ మహంకాళి బోనాల తరహాలో తూప్రాన్ పట్టణంలో జరపడం అనవాయితీ. కాగా సోమవారం జాతరలో భాగంగా మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్గౌడ్ ఆధ్వర్యంలో భవిష్యవాణి, రంగం కార్యక్రమాలను జరిపారు. సాయంత్రం నుంచి పలు యువజన సంఘాల సభ్యులు తొట్టెలను ఊరేగించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
చందాయిపేటలో దుర్గమాత జాతర
చేగుంట, జూలై25: మండలంలోని చందాయిపేట దుర్గ మ్మ జాతర రెండు రోజుల నుంచి గ్రామ సర్పంచ్ స్వర్ణలతాభాగ్యరాజ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం గ్రామంలోని శివలింగం వద్ద పోతరాజుల ప్రదర్శ న, దుర్గాభవానీ దేవాస్థానం వద్ద రంగం, కుంబ గావు, పొలిమెర సరువు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉత్సవాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు సోలిపేట సతీశ్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాడెం వెంగళ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనక్ ప్రవీణ్కుమార్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు రంగయ్యగారి రాజిరెడ్డి పాల్గొని అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. వివిధ గ్రామాలకు చెందిన మహిళ భక్తులు అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించారు. చేగుంట వాస్తవ్యు లు ‘సండ్రుగు ఆగం’ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సుభాశ్రెడ్డి, విఠల్రెడ్డి, కోమండ్ల నారాయణరెడ్డి, సర్పంచులు కాశబోయిన భాస్కర్, కొటారి అశోక్, దొరగొల్ల రాములు, రైతుబంధు జిల్లా డైరెక్టర్ చెర్యాల మోహన్రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఫలాహరం బండ్ల ఊరేగింపు
చేగుంటలోని మహాంకాళి అమ్మవారి ఉత్సవాల భాగంగా యువ నాయకుడు డిష్రాజు వారి మిత్ర బృందం ఆధ్వర్యం లో ఫలహారాల బండి తీశారు. టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నా యకుడు సోలిపేట సతీశ్రెడ్డి, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి ఫలహారం బండి ఊరేగింపును ప్రారంభించారు. అనంతరం అమ్మవారి హుండీ లెక్కించారు.