అమీన్పూర్, జనవరి 23 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో పారదర్శకంగా పరిపాలన అం దిస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పటేల్గూడలో రూ.1.50 కోట్ల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో పూర్తి నిరాదరణకు గురైన గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ప్రతినెలా నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు.
నూతనంగా ఏర్పడిన గ్రామాలతోపాటు శిథిలావస్థలో ఉన్న పంచాయతీ భవనాలను తొలిగించి, ఆధునిక హంగులతో భవనాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్లు ప్రతిరోజూ ఉదయం గ్రామంలో పర్యటించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీరంగూడ నుంచి కిష్టారెడ్డి పేట వరకు రూ.67 కోట్లతో చేపట్టిర రహదారి పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. కార్యక్రమంలో సంగారెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ దేవానంద్, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, సర్పంచ్ నితీశాశ్రీకాంత్, కార్పొరేటర్ పుష్పానగేశ్ యాదవ్, కుమార్యాదవ్, అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందా రం నరసింహాగౌడ్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్రెడ్డి, చంద్రారెడ్డి, బాశెట్టి కృష్ణ, తలారి రాములు, జ్ఞానేశ్వర్, తులసిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.