జహీరాబాద్, జూలై 4 : సర్కారు దవాఖానలో పేదలకు సకల సౌకర్యాలతో వైద్య చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం కార్పొరేటు దవాఖాన స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించింది. రోగులకు మెరుగైన చికిత్సలు అందించేందుకు ప్రాణావాయువును అందుబాటులోకి తీసుకువచ్చింది. జహీరాబాద్ ఏరియా దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు రూ. కోటితో 500 ఎల్పీఎం (లీటర్స్ ఫర్ మినట్) సామర్థ్యంతో ఆక్సిజన్ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి ట్యాంకర్లు, యంత్ర పరికరాలు, రోగులకు ఆక్సిజన్ అందించేందుకు అందుబాటులోకి తీసుకువచ్చారు. జహీరాబాద్ సర్కారు దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ఆక్సిజన్ప్లాంట్, డయాలసిస్, ఎక్స్రే, స్కానింగ్, ఈసీజీ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కరోనాకు సంబంధించిన మందులు నిల్వ ఉంచడంతో పాటు వ్యాక్సినేషన్ వేగవంతం చేస్తున్నారు. రోగులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంతో పాటు మందులు అందుబాటులో తీసుకువచ్చారు.
కర్ణాటక సరిహద్దులో ఉన్న జహీరాబాద్ ఏరియా దవాఖానలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మొదలు కావడంతో వాటికి సంబంధించిన మందులు దవాఖానలో అందుబాటులో ఉంచారు. గతేడాది ఏరియా దవాఖానలో 70 పడకలతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేసి రోగులకు వైద్య చికిత్సలు అందించారు. ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం కావడంతో 100 పడకలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేశారు. 10 పడకలతో ఐసీయూ వార్డులో రోగులకు వైద్యం అందిస్తున్నారు. దవాఖానలో సిటీస్కాన్, డిజిటల్ పోర్ట్బుల్, ఎక్స్రే, వెంటిలేటర్ సిద్ధం చేశారు. 500 లీటర్ల ఆక్సిజన్ నిల్వ ఉన్న ప్లాంట్ అందుబాటులో ఉంది. దవాఖానలో కొవిడ్ రోగుల కోసం 70 పడకలు సిద్ధం చేసి ఉంచారు. గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేసేందుకు వైద్యులు, సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. జహీరాబాద్ పట్టణం 65వ జాతీయ రహదారిపై ఉండడంతో ప్రభుత్వం అత్యవసర సమయంలో వైద్య చికిత్సలు చేసేందుకు ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేసి వైద్యులు, సిబ్బందిని నియమించారు.
రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు
జహీరాబాద్ సర్కార్ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. దవాఖానలో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించింది. రోగులకు చికిత్సలు చేసేందుకు వైద్యులు, సిబ్బందిని నియమించింది. అత్యవసర సమయంలో రోగులకు అక్సిజన్ అందించేందుకు ప్లాంట్, అత్యవసర చికిత్సకు ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేశారు.
-సయ్యద్ మోహినొద్దీన్,టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జహీరాబాద్
రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి
జహీరాబాద్ సర్కార్ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం రోగులకు మెరుగైన వైద్యం చేసేందుకు మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచింది. అత్యవసర సమయంలో వైద్యం చేసేందుకు ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతి రోగికి ఆక్సిజన్ అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. దవాఖానలో కార్పొరేటు వైద్యం అందించేందుకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పించింది.
-డాక్టర్ శేషురావు, సూపరింటెండెంట్ జహీరాబాద్