శివ్వంపేట, జూలై4: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని దంతాన్పల్లిలో నాచారానికి చెందిన ‘సిరి’సీడ్ కంపెనీ ప్రతినిధులు పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో రమేశ్ విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలకు నిధు లు కేటాయిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నదని తెలిపారు. విద్యార్థులు ఇష్టంతో చదివి మంచి స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, రాష్ర్టానికి మం చిపేరు తీసుకురావాలన్నారు. గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు ‘సిరిసీడ్స్ ప్రైవేటు లిమిటెడ్’ వారు బ్యాగులు, నోట్బుక్స్, పెన్నులు అందించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో కంపెనీ యాజమాన్యం రాకేశ్రెడ్డి, సర్పంచ్ కన్నారం దుర్గేశ్, ఉప సర్పంచ్ నాగేశ్వర్రావు, ప్రధానోపాధ్యాయు డు సత్యం, ఉపాధ్యాయులు కవిత, విద్యార్థులు పాల్గొన్నారు.