ఝరాసంగం,జూలై1: ఉమ్మడి పాలనలో చిన్నాభిన్నమైన వ్యవసాయ రంగానికి స్వరాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు ఊపిరినిచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం సాగు రంగంలో నూతన సంస్కరణలు చేపట్టి, చెరువుల్లో పూడికతీత, మిషన్ కాకతీయ, నిరంతర విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. దీంతో వలస బాట పట్టిన అన్నదాతలు పొలం బాట పట్టారు. విద్యుత్ నుంచి మొదలుకొని పంట చేతికొచ్చే వరకు అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. ఏ రాష్ట్రం లో లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలవుతన్నాయి. అందుబాటులో విత్తనాలు, ఎరువులు ఉన్నా యి. దీంతో వ్యవసాయం పండుగలా మారింది.
అన్నదాతల అభివృద్ధే ధ్యేయంగా..
రైతుల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ సర్కారు రైతు విత్తనం నాటి న నుంచి పంట చేతికి వచ్చే వరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తు న్న ది. వానకాలం, యాసంగి సీజన్కు ముందుగానే అవసరమైన విత్తనా లు, ఎరువులు నిల్వ చేసుకోవడంతో రైతులు ఇక్కట్లకు చెక్ పెట్టినట్లు య్యింది. సాగు అంచనా వేసిన అధికారులు అందుకు అనుగుణంగానే టీనీడ్స్ కార్పొ రేషన్ ఇండెంట్ పంపడంతో విత్తన కొరత అధిగమించినట్లయ్యింది. ఎరువులను నెల రోజుల ముందుగానే మార్క్ఫెడ్ అధికారులు గోదాముల్లో నిల్వ ఉంచారు. సాగులో నూతన పద్ధతులు తీసుకురావడంతో అధిక దిగుబడులు పొందేందుకు మార్గం సుగమమైంది. పండిన పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రతి ఏడాది వరి, పత్తి, కంది, శనగ, సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
నిరంతర విద్యుత్తో తొలిగిన ఇబ్బందులు
వచ్చిరాని కరెంటుతో మాటిమాటికి మోటర్లు కాలిపోవడంతో రైతులకు మరింత ఆర్థిక భారం పడేది. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల బాధలు గమనించి 24 గంటల విద్యుత్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం కరెంటు కోతలు లేకుండా చేసింది. నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆధునిక సాగుకు యాంత్రీకరణ తోడు
ఆధునిక పద్ధతుల్లో రైతులు సాగు చేపట్టాలని ఉద్దేశంతో తెలంగాణ సర్కారు యాంత్రీకరణ పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకంతో నాలుగేండ్లుగా అన్నదాతలకు అవసరమైన మేరకు ట్రాక్టర్లు, రూటవేటర్లు, కలుపు తీసే మిషన్లు, సరికొత్త యంత్రాలు అందజేసింది. గ్రామాల్లో అవసరమైన సలహాలు, సూచనలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏఈవోల నియమాకం చేపట్టింది. ప్రతి 5వేల ఎకరాలకు ఒక విస్తీర్ణ అధికారిని అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్నది. గ్రామాల్లోని రైతుల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేసింది.
ఆధునిక సాగు పద్ధతులపై దృష్టి
అధిక దిగుబడులు పొందేందుకు రైతు లు వృథా ఖర్చులు తగ్గించుకుని ఆధునిక సాగు పద్ధతులపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. జీలుగ సాగుతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని వ్యవసాయధికారులు చెబుతున్నారు. చెరువు, కుంటల్లోని ఒండ్రు మట్టిని ట్రాక్టర్లలో తెచ్చి డబ్బును వృథా చేసుకోవడం కన్నా నేల స్వభావాన్ని బట్టి పచ్చిరొట్ట ఎరువుల సాయంతో సారవంతంగా మార్చుకోవచ్చు. పచ్చిరొట్టతో భూసారం పెరుగుతుంది. నేల సారవంతమవుతుంది. పంటకు కావాల్సిన పోషకాలు అందుతాయి. దీంతో రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. పచ్చిరొట్ట ఎరువుల కోసం నిర్దేశించిన మొక్కలను పొలంలో కలియదున్నడం, మూలంగా అవి కుళ్లి సారవంతమైన భూమిని అందిస్తాయి. ఏకవార్షిక మొక్కల్లో ప్రథమ స్థానం జీలుగ. చౌడు, వరి పండించే భూములకు అనుకూలం. తేలికపాటి ఇసుక నేలల్లో సైతం సాగు చేయవచ్చు.
ఎకరాకు 12 నుంచి 15 కిలోలు..
ఎకరానికి 12 నుంచి 15 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. దీన్ని పూత దశలో కలియదున్నడంతో ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. ఒక టన్ను పచ్చి రొట్టలో సుమారు 6 కిలోలు నత్రజని, కిలోన్నర భాస్వరం, 5 కిలోల పొటాష్ ఉంటాయి. పచ్చి రొట్ట పైరు సుమారు 60 నుంచి 70 రోజులు ఉంటుంది. రైతులు తమకు అందుబాటులో ఉన్న వనరుల బట్టి పంట సరళిని బట్టి ప్రధాన పంట వేయడానికి కనీసం 60 రోజుల వ్యవధి ఉన్నప్పుడే పచ్చి రొట్ట పైరులకు సాగు చేయాలి. 45 నుంచి 50 రోజులకు పూత దశలో వీటిని కలియదున్ని 10 నుంచి 15 రోజుల పాటు కుళ్లనిస్తే సేంద్రియ పదార్థంగా మారి పోషకాలు పంటకు అందుబాటులోకి వస్తాయి. పైరు ముదిరేతే పీచు పదార్థం పెరిగి త్వరగా కుళ్లదు. వీటిని సాగు చేయడంతో భూసారం పెరుగుతుంది.
65 శాతం సబ్సిడీ
ప్రభుత్వం 65శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తున్నది. రూ.665కు 30కిలోల బస్తా అందజేస్తున్నది. విత్తనాలు అవసరమైన రైతు లు వ్యవసాయ పాస్బుక్, ఆధార్కార్డు జిరాక్స్తో ఆగ్రోస్ కేంద్రంలో సంప్రదించాలని వ్యవసాయధికారులు సూచిస్తున్నారు.
కేసీఆర్కు రుణపడి ఉంటాం
చిన్న సన్నకారు నుంచి పెద్ద రైతుల వరకు ఏడాదికి రెండు దఫాలుగా రైతుబంధు పథకంలో భాగంగా పంట పెట్టుబడికి మా బ్యాం కు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. దీం తో మాకు వేరే వారి నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. వడ్డీలు కట్టనక్కరలేదు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అనేక పథకాలతో రైతులు సంతోషంగా ఉన్నారు. కేసీఆర్కు అంతా రుణపడి ఉంటాం.
– కృష్ణ, రైతు (కుప్పానగర్)
రైతుబంధుతో అందరికీ మేలు
పంటలను పండించేందుకు రైతులందరికీ సీఎం కేసీఆర్ సారు రైతుబంధు సహా యం చేయడం చాలా సంతోషం. పెట్టుబడి డబ్బులతో రైతులందరికీ మేలు జరుగుతున్నది. పంటలు వేయడానికి ఖర్చుల కోసం వేరే వాళ్ల దగ్గర అప్పులు చేయాల్సిన అవసరం లేదు. ఇంతమంచి పథకం తెచ్చిన సీఎం కేసీఆర్ సారుకు రైతులందరూ రుణపడి ఉంటారు.
– బస్వరాజ్, రైతు మాచిరెడ్డిపల్లి, కోహీర్
నిరంతర విద్యుత్తో తొలిగిన ఇబ్బందులు
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం అనేక ఇబ్బందులు పడ్డాం. రాత్రి, పగలు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియకుండా ఉం డేది. దీంతో పంటలకు సకాలంలో నీరు అందించక ఎండిపోయేవి. సీఎం కేసీఆర్ హయాంలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఉంది. దీంతో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– అంజిరెడ్డి, రైతు (సంగంకె)
రైతుల పాలిట వరం రైతు బీమా
రైతు బీమా పథకం రైతులకు వరంలాంటింది. ఈ పథకంతో రైతు కుటుంబాలకు ఊరట లభించింది. గత ప్రభుత్వాలు ఏవీ ఇలాంటి పథకాల గురించి అలోచించలేదు. గతంలో వ్యవసాయ సంక్షోభంతో ఎన్నో రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బీమా భరోసానిచ్చింది. రైతులంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు.
– మంగలి ప్రభు, రైతు (జీర్లపల్లి)