మెదక్ మున్సిపాలిటీ/ రామాయంపేట/ హవేళీఘనపూర్/ కొల్చారం/ శివ్వంపేట/పెద్దశంకరంపేట/ నర్సాపూర్/ రేగోడ్/ చిన్నశంకరంపేట/ పాపన్నపేట/ టేక్మాల్/ అల్లాదుర్గం/ చిలిపిచెడ్/ నిజాంపేట/ వెల్దుర్తి/ చేగుంట/ తూప్రాన్, జూన్ 30 : పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు గురువారం ప్రకటిం చారు. రామాయంపేట ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 99 మంది, మోడల్ స్కూల్లో 88 మంది విద్యార్థులు అందరూ పాసై వందశాతం ఉత్తీర్ణత సాధించారు. నిజాంపేట మండలంలోని 225 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 219 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో తెలిపారు.
కొల్చారం మండలంలో 98 శాతం ఉత్తీర్ణత
కొల్చారం మండల వ్యాప్తంగా 98 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో నీలకంఠం తెలిపారు. 11 పాఠశాలల్లో 572 మంది విద్యార్థులకు 563 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన జి.దివ్య 10/10 జిపిఏ సాధించినట్లు ఎంఈవో తెలిపారు.
‘ఫూలె’ బాలికల పాఠశాలలో ‘వంద’
హవేళీఘనపూర్ మండల కేంద్రంలోని జ్యోతిబాఫూలె బాలికల పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో నీలకంఠం తెలిపారు. హవేళీఘనపూర్ జడ్పీ హైస్కూల్లో 150 మందికి 128 మంది, బూర్గుపల్లి జడ్పీ హైస్కూల్లో 114 మందికి 111 మంది, కూచన్పల్లి జడ్పీ హైస్కూల్లో 56 మందికి 56 మంది పాసైనట్లు తెలిపారు.
‘వంద’ సాధించిన పిల్లుట్ల ప్రభుత్వ పాఠశాల
శివ్వంపేట మండలం పిల్లుట్ల జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించినది. కేజీబీవీకి చెందిన లావణ్య, నవీన, జడ్పీహెచ్ఎస్ శివ్వంపేటకు చెందిన మానస 9.8 జీపీఏ సాధించినట్టు ఎంఈవో బుచ్యానాయక్ చెప్పారు.
రేగోడ్లోని మోడల్, జిల్లా పరిషత్, గజవాడలోని కస్తూర్బా, జగిర్యాల్ జడ్పీ, లింగంపల్లి జడ్పీ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని కాంప్లెక్స్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తెలిపారు.
పెద్దశంకరంపేట మోడల్ పాఠశాలలో 100 శాతం
పెద్దశంకరంపేట మండలంలో 86.4 శాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో బుచ్చానాయక్తెలిపారు. మోడల్ పాఠశాలలో 100 శాతం సాధించారని ప్రిన్సిపాల్ విఠల్నాయక్ తెలిపారు. కస్తూర్బాగాంధీ పాఠశాలలో 84 శాతం, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 65, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 92 శాతం, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 77 శాతం, చీలపల్లి ఉన్నత పాఠశాలలో 70 శాతం, మూసాపేట ఉన్నత పాఠశాలలో 90 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు.
సత్తాచాటిన మైనార్టీ రెసిడెన్షియల్ విద్యార్థులు
నర్సాపూర్ పట్టణంలోని మైనార్టీ పాఠశాల విద్యార్థులు 98.27 శాతం ఉత్తీర్ణత సాధించారు. మహమ్మద్ కైఫ్ 10, యాసీన్బాబా 9.8, మహసన్ ఖాద్రీ 9.7 జీపీఏ సాధించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ సంఘమేశ్వర్ అభినందించారు.
జక్కపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు 97.94 శాతం ఉత్తీర్ణత సాధించారు. పూజిత 9.8, నదియ 9.8, వాణి 9.7 జీపీఏ సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ విజయలక్ష్మి అభినందించారు.
చిన్నశంకరంపేట మండలంలో 499 మంది విద్యార్థులకు 463 మంది ఉత్తీర్ణత సాధించారు. చిన్నశంకరంపేట మోడల్ పాఠశాల విద్యార్థులు హరిణిశ్రీ, వినయ్ 10 జీపీఏ సాధించి టాపర్లుగా నిలిచారు. 39 మంది 9జీపీఏ సాధించారు.
పాపన్నపేట మండలంలో 98 శాతం..
పాపన్నపేట మండలంలో 98శాతం ఉత్తీర్ణత సాధించారు. 11 ఉన్నత పాఠశాలల నుంచి 664 మంది పరీక్షలకు హాజరు కాగా, 651 మంది ఉత్తీర్ణతతో 98 శాతం ఫలితాలు వచ్చాయి. పాపన్నపేట మండలంలో 6 మంది 10 జీపీఏ సాధించారు. విద్యార్థులను పాపన్నపేట హెచ్ఎం హరిసింగ్ రాథోడ్, కుర్తివాడ పాఠశాల హెచ్ఎం అంజాగౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
టేక్మాల్ మండలంలో 97 శాతం ఉతీర్ణత
టేక్మాల్ మండలంలో 97శాతం ఉతీర్ణత సాధించినట్టు ఎంఈవో నీలకంఠం తెలిపారు. ఏడుగురు విద్యార్థులకు 10 జీపీఏ వచ్చాయని, మొత్తం 453 మంది పరీక్షకు హాజరు కాగా, 441 మంది ఉతీర్ణత సాధించారని వివరించారు.
అల్లాదుర్గం మండలంలో 99 శాతం
అల్లాదుర్గం మండలం 99 శాతం ఉత్తీర్ణత సాధించింది. అల్లాదుర్గం బాలుర, చిల్వెర, కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ముస్లాపూర్ పాఠశాలలో 44 మందికి 43, గడిపెద్దాపూర్ పాఠశాలలో 65 మందికి 64, అల్లాదుర్గం బాలికల పాఠశాలలో 81 మందికి 79 మంది పాసయ్యారు. ముస్లాపూర్ పాఠశాలకు చెందిన మధులత, కావ్య 10, అక్షయ, శిల్ప 9.8, మానస, లక్ష్మి, విఘ్నేష్ లు 9.7 జీపీఏ సాధించారు. విద్యార్థులను టీచర్లు అభినందించారు.
చిలిపిచెడ్ ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం
చిలిపిచెడ్ మండలంలో 178మంది పరీక్ష రాయగా 170 మంది ఉత్తీర్ణులయ్యారు. చిలిపిచెడ్ ఉన్నత పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫైజాబాద్ 94, చిట్కుల్ కేజీవీబీ 87. 7, చిట్కుల్ 97, చండూర్ 91,గౌతాపూర్ 97, సోమక్కపేట 97 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో తెలిపారు.
నిజాంపేట మండలంలో 97.3శాతం ఉత్తీర్ణత సాధించినది.
మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ‘వంద’
మెదక్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉతీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కవిత ఒక ప్రకటనలో తెలిపారు.
వెల్దుర్తి మండలంలో 96 శాతం ఉత్తీర్ణత..
వెల్దుర్తి మండలంలో 479 మందికి 459 మంది ఉత్తీర్ణతతో 96 శాతం సాధించగా, 20 మంది విద్యార్థులు మాత్రమే ఫెయిల్ అయ్యారు. వెల్దుర్తి కస్తూర్బా, మానేపల్లి పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. మంగళపర్తి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రణయ్, మౌనిక 9.8 గ్రేడ్ సాధించారు.
చేగుంట మండలంలోని కరీంనగర్ పాఠశాల విద్యార్థులు వందశాతం సాధించినట్లు ఏంఈవో బుచ్చనాయక్ తెలిపారు. తూప్రాన్ గీతా పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించినది.
ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్
హవేళీఘనపూర్, జూన్ 30 : వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయవచ్చని డీఈవో రమేశ్కుమార్ అన్నారు. గురువారం హవేళీఘనపూర్లోని వాడి ప్రాథమిక పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలతో పా టు స్వయంగా తయారు చేసిన వంటలను పరిశీలించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో నీలకంఠం, హెచ్ఎం మధుమోహన్, సర్పంచ్ యామిరెడ్డి పాల్గొన్నారు.