కొల్చారం, జూన్ 30: నీటి సంరక్షణ విధానాలు చెప్తుంటే విన్నాం.. కానీ ఫీల్డుకెళ్లి చూస్తే చాలా బాగున్నాయి.. వెల్ డన్ అని కేంద్ర ప్రభుత్వ జలవనరుల మంత్రిత్వ శాఖ నోడల్ డైరెక్టర్ హవోకిస్ అన్నారు. కొల్చారంలోని జలశక్తి అభియాన్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధికి గ్రామీణాభివృద్ధి, అటవీ, వ్యవసాయ, ఇంజినీరింగ్ శాఖలు చేపట్టిన కార్యక్రమాలను డీఆర్డీవో శ్రీనివాస్, టెక్నికల్ అధికారి, శాస్త్రవేత్త యూబీ పాటిల్తో కలిసి గురువారం పరిశీలించారు. కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్, ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన రూప్ టాప్ వాటర్ హార్వేస్టింగ్ స్ట్రక్చర్తో నీటి సంరక్షణ విధానాన్ని డీఆర్డీవో వివరించారు. అక్కడి నుంచి చెరువులు, కుంటల్లో ఉపాధి హామీలో చేపట్టిన పనులను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం, నీటి సంరక్షణ పనులు పరిశీలించారు. వారితో ఎంపీపీ మంజుల, మండల ప్రత్యేకాధికారి పద్మజ, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఏపీవో మహిపాల్రెడ్డి, సర్పంచ్ ఉమారాణి, పంచాయతీ కార్యదర్శి అంజయ్య ఉన్నారు.
కూచన్పల్లి చెక్డ్యాంను కేంద్ర బృందం సందర్శన
హవేళీఘనపూర్, జూన్ 30: మండలంలోని కూచన్పల్లి శివారులో నిర్మించిన చెక్డ్యాంను జలశక్తి అభియాన్ బృందం సభ్యులు సందర్శించారు. కేంద్ర బృందం సభ్యులు ఆవ్ కిప్, టెక్నికల్ సైంటిస్టు యూబీ పాటిల్కు మెదక్ డీఆర్డీవో పీడీ శ్రీనివాసరావు చెక్డ్యాంతో అందుతున్న ఫలాలను వివరించారు. వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేసి సాగుకు వినియోగిస్తున్న తీరును చూసి వారు అభినందించారు. వారితో హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, ఎంపీడీవో శ్రీరామ్, సర్పంచ్ దేవాగౌడ్, ఉప సర్పంచ్ బయ్యన్న, ఏపీవో రాజ్కుమార్ ఉన్నారు.