మెదక్ మున్సిపాలిటీ, జూన్ 29: శాస్త్రీయ పద్ధతిలో గణాంకాలు సేకరిస్తేనే కచ్చితత్వం ఉంటాయని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. భారత ప్రణాళికా నిర్దేశకుడు, దేశ మొదటి ప్లానింగ్ కమిషన్ సభ్యుడు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ జయంతి పురస్కరించుకుని 16వ జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహించారు.
బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గణాంకాలు ప్రామాణికంగా ఉండాలంటే ముందుగా శాంపిల్స్, సర్వే కచ్చితత్వం ఉండాలన్నారు. అనంతరం గణాక శాఖ ముద్రించిన 2020-21 మెదక్ జిల్లా గణాంక దర్శిని పుస్తకాన్ని అదనపు కలెక్టర్ రమేశ్, జిల్లా ప్రణాళిక అధికారి కొట్యాల్తో కలిసి ఆవిష్కరించారు. అంతకుముందు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో డివిజనల్, మండల గణాంకాధికారులు తదితరులు పాల్గొన్నారు.