రామాయంపేట/ కొల్చారం/ పాపన్నపేట/ వెల్దుర్తి/ నర్సాపూర్/ చేగుంట, జూన్ 28 : మంగళవారం వెలుబడిన ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. రామాయంపేట జూని యర్ కళాశాలలో 54శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి తెలిపారు. రామాయంపేట ప్రభుత్వ కళాశాలలో ఫస్టియర్లో 210 మందికి 106 మంది, సెకండియర్లో 120 మందికి 70 మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. ఒకేషనల్లో నాగమణి 929 మార్కులు సాధించి జిల్లాలో ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులను ప్రిన్సిపాల్, లెక్చరర్లు సన్మానించారు. రామాయంపేటలోని స్నేహ కళాశాలలో ప్రదీప్కుమార్(ఎంపీసీ) 992 మా ర్కులు సాధించి జిల్లాలో టాపర్గా నిలిచారు.
కొల్చారం కళాశాలలో 48శాతం ఉత్తీర్ణత
కొల్చారం ప్రభుత్వ జూనియర్ కళాశాల 48 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ యతిరాజవల్లి తెలిపారు. ఫస్టి యర్లో 123 మందికి 59, సెకండియర్లో 79 మందికి 38 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. బైపీసీలో రాజు 822, ఎంపీసీ లో సిమ్రాన్ 742, సీఈసీలో ఎండీ సాధియా 633, హెచ్ఈసీలో అఖిల్ 380 మార్కులు సాధించినట్లు తెలిపారు.
పాపన్నపేట కళాశాలలో 54 ఉత్తీర్ణత శాతం
పాపన్నపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ నర్సింహులు తెలిపారు. రిజ్వానా (ఎంపీసీ) 911, నాగరాజు (బైపీసీ)లో 929 మా ర్కులు సాధించారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు అభినందించారు.
వెల్దుర్తి కళాశాలలో 96 శాతం ఉత్తీర్ణత…
వెల్దుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకం డియర్కు చెందిన 88 మంది పరీక్షలు రాయగా, 85 మంది విద్యార్థులు ఉత్తీర్ణత(96.6శాతం) సాధించారు. బైపీసీలో పూజ 936, రేణుక 932, ఎంపీసీలో అఖిల 837, సంధ్య 825, సీఈసీలో శ్రీకాంత్ 840, పూజ 836 మార్కులు సాధించారు. ఫస్టియర్ లో అఖిల (సీఈసీ)436, సమీరా 438, ఎంపీసీలో మానస 412, మహేశ్వరి 410, బైపీసీలో శిరీష 411, నిఖిత 408 మార్కులతో మొదటి, రెండో స్థానాల్లో నిలిచారు. ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే అధిక మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు అభినందించారు. ప్రభుత్వ కళా శాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని పేర్కొన్నారు.
నర్సాపూర్ కళాశాలలో..
నర్సాపూర్ ప్రభుత్వ కళాశాలలో ఎన్.కిరణ్ (ఎంపీసీ) 830 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ రవీందర్ తెలిపారు. ఫస్టియర్లో ఆర్.వర్ష 451 మార్కులతో టాపర్గా నిలిచారన్నారు. ఫస్టియర్లో 53, సెకండియర్లో 72 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ వివరించారు.
సత్తాచాటిన మోడల్ కళాశాల విద్యార్థులు
నర్సాపూర్ మోడల్ విద్యార్థులు సత్తాచాటారు. ఫస్టియర్లో 119 మందికి 60, సెకండియర్లో 94 మందికి 57 మంది ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలి పారు. పూజ (బైపీసీ) 904, సాయికిరణ్(ఎంపీసీ) 946, ఉమ (సీఈసీ) 863, జువేనాబేగం (ఎంఈసీ) 884, ఫస్టియర్లో అర్షియా బేగం (బైపీసీ) 409, సైదాబేగం (ఎంపీసీ) 437, సీహెచ్ సాయికిరణ్ (సీఈసీ)454 మార్కులు సాధించారని తెలిపారు.
చేగుంట ఆదర్శపాఠశాల విద్యార్థుల ప్రతిభ …
చేగుంట ఆదర్శ పాఠశాల విద్యార్థులు ప్రతిభకనబర్చినట్లు ప్రిన్సిపాల్ భూపాల్రెడ్డి తెలిపారు. ఫస్ట్టియర్లో 65 శాతం, సెకండియర్లో 85 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించార న్నారు. ఫస్ట్టియర్లో లోకేంద్ర బండారి 464, మోహిత్యాదవ్ 451, రుసూల్కుమారి 429 మార్కులు సాధించారు. సెకండియర్లో పోతారం స్వాత్రిక 925, దుంపల సుప్రియ 877, చిట్టబోయిన జ్యోతిశ్రీ 864 మార్కులు సాధించారు.