మెదక్ మున్సిపాలిటీ/ చేగుంట/ టేక్మాల్,/ రామాయంపేట, జూన్ 21 : ప్రొఫెసర్ జయశంకర్సార్ సేవలు మరువరానివని ఉపాధ్యాయ జేఏసీ మండల కన్వీనర్ ప్రభాకర్ పేర్కొన్నారు. చేగుంట, నార్సింగి మండలంలోని పలు పాఠశాలల్లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి నిర్వహించారు. చేగుంట మండలంలోని చిన్నశివునూర్, చెట్లతిమ్మాయిపల్లి, క ర్నాల్పల్లి లోని ప్రభుత్వ పాఠశాలల్లో జయశంకర్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు.కార్యక్రమంలో హెచ్ఎంలు ప్రభాకర్, సత్యనారాయణ, అక్బర్పాషా, రాములు, కె.జగన్లాల్, శశిధర్రెడ్డి, రవీందర్, అనిత, శర్మ, రాజశేఖర్రెడ్డి, హరిరంజన్శర్మ, సుధాకర్, కవిత, రేణుక, అరుణ, ఉపాధ్యా యులు, విద్యార్థులు న్నారు.
మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో..
జిల్లా కేంద్రం మెదక్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జయశంకర్సార్ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గణపతి, వైస్ప్రిన్సిపాల్ ప్రవీణ్కుమార్, అధ్యాపకులు నారాయణ, సుధాకర్, తిరుమల్రెడ్డి, రాజేంద్రప్రసాద్, వినోద్, విద్యార్థులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన ఎంపీపీ నార్సింపేట భిక్షపతి
రామాయంపేటలోని ఎంపీపీ కార్యాలయంలో జయశంకర్సార్ చిత్రపటానికి ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, జడ్పీటీసీ సంధ్య పూలమాల వేసి నివాళులర్పించారు. రాయిలాపూర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ భూమగారి నర్సాగౌడ్ ఆధ్వర్యంలో జయశంకర్సార్ వర్ధంతి నిర్వహిం చారు. ఉద్యమస్ఫూర్తి ప్రధాత జయశంకర్సార్ ఆశయాలను సాధిస్తామని ఎంపీపీ భిక్షపతి పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సిద్దిరాంరెడ్డి, దేవేందర్ తదితరులున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్సార్ స్ఫూర్తి ప్రదాత
టేక్మాల్ మండల కేంద్రంలోని చౌరసాలో జయశంకర్ విగ్రహనికి టీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వసి, నివాళులర్పించారు.జయశంకర్ సార్ స్ఫూర్తిప్రదాత అని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భక్తుల వీరప్ప అన్నారు. కార్యక్రమం లో సర్పంచ్లు సుప్రజా,గోపాల్,రాజు, నాయకులు నాయికోటి భాస్కర్, సాయిలు, రాజు, మహేందర్నాయక్, కిషన్, సికిందర్, చందర్, సాయిబాబా, రమేశ్ పాల్గొన్నారు.