సంగారెడ్డి, జూన్ 21: గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లలో జిల్లా టాప్లో నిలిచింది. జిల్లాలోని 647 గ్రామ పంచాయతీల్లో వందశాతం ఇంటి, ఆస్తి పన్నులు వసూలు చేసి ఔర అనిపించింది. ఇప్పటి వరకు జిల్లాలో రూ. 34,95,89,737కోట్లను పంచాయతీలు వసూల్ చేసి గ్రా మాల అభివృద్ధికి పాటుపడుతున్నాయి. పంచాయతీ అధికారులు, కార్యదర్శులు ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల యాజమాన్యం నుంచి రూ. 20లక్షలు, కోవాలెంట్ పరిశ్రమ యాజమాన్యం నుంచి రూ. 1.10కోట్ల ఆస్తి పన్నును సకాలంలో వసూలు చేశారు. జిల్లాలో పూర్తిగా ఇంటి, ఆస్తి పన్నులు 100శాతం వసూళ్లు అయ్యాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మార్చి నెల నాటికి పూర్తి స్థాయిలో పన్నుల వసూళ్లు చేసి టాప్లో నిలవడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు 100శాతం పన్నులను వసూల్ చేసి అగ్రస్థానంలో జిల్లాను నిలిపినందుకు అధికారులు కార్యదర్శులను అభినందించారు.
జనాభా ప్రకారం నిధులు విడుదల..
గ్రామాల అభివృద్ధికి జనాభా ప్రాతిపదికన నిధులను విడుదల చేస్తూ అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే చిన్న పంచాయతీలుగా తండాలను ఏర్పాటు చేసి అభివృద్ధిలో మరో ముందడుగు వేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు అభివృద్ధి జరుగడానికి ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించడమే.
అత్యధికం పటాన్చెరు.. అత్యల్పం నాగిల్గిద్ద
జిల్లాలో పరిశ్రమల కేంద్రంగా పేరుగాంచిన పటాన్ చెరు లో 19గ్రామ పంచాయతీల్లో అత్యధికంగా రూ. 10.13 కోట్ల పన్నులు వసూలు అయ్యాయి. అలాగే జిల్లాలోని మారుమూల ప్రాంతమైన నాగిల్గిద్ద మండలంలో అధికంగా 31 పంచాయతీలు ఉన్న, పరిశ్రమలు లేని కారణంగా కేవలం ఇంటి పన్ను వసూళ్లతో రూ.6,06,230లక్షలు అయినట్లు సమాచారం. కోటికిపైగా పన్నుల వసూళ్లలో గుమ్మడిదల మండలంలో రూ. 7,07,05,196కోట్లు, జిన్నారంలో రూ. 4,56,60,849కోట్లు, కందిలో 22 పం చాయతీల్లో రూ. 2,39,12,337కోట్లు, అమీన్పూర్ మండలంలోని 8 పంచాయతీల్లో రూ. 2,34,99,728 కోట్లు, కొండాపూర్లో 24 పంచాయతీల్లో రూ.1,91,67, 723 కోట్లు, హత్నుర మండలంలోని 38పంచాయతీల్లో రూ. 1,82,61,074 కోట్లు ఇంటి, ఆస్తి పన్నులు వసూళ్లు అయ్యాయని అధికారులు వివరించారు. దీంతో పన్నుల వసూళ్లలో పూర్తిస్థాయి వసూళ్ల చేసిన జిల్లాగా టాప్లో నిలిచింది.
జిల్లాలో వందశాతం పన్నుల వసూలు
జిల్లాలోని అన్ని మండ లాల పరిధిలోని గ్రామాల్లో 100 శాతం పన్నులు వసూలు అయ్యాయి. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శులకు వసూల్ చేయడానికి మార్చి నెల వరకు గడువు ఇవ్వడంతో లక్ష్యాన్ని సాధించారు. ప్రతి యేటా ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో ఇంటి, ఆస్తి పన్ను లను సకాలంలో వసూలు చేయాల్సి ఉన్నది. జిల్లాలోని మండలాల్లో వందశాతం పన్నులు వసూల్ చేశాం. మార్చి నెలాకరుకు పూర్తి స్థాయిలో జిల్లాలో పన్నులు వసూలు చేసి ప్రభు త్వ లక్ష్యాన్ని చేరుకున్నాం. గ్రామాల్లో పన్నులు వసూ లు అయితేనే అభివృద్దికి నిధులు వస్తాయి.
– సురేశ్ మోహన్, జిల్లా పంచాయతీ ,అధికారి సంగారెడ్డి