మెదక్, మే 31 (నమస్తే తెలంగాణ) : ముద్ర పథకంలో భాగం గా వీధి వ్యాపారులకు ఆర్థికసాయం అందించడం ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం దేశవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ముద్ర’ ద్వారా ప్రయోజనం పొందిన వీధి వ్యాపారులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ముద్రతో నవ భారత నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు.
వివిధ కార్యక్రమాల్లో పారదర్శకత పాటిస్తూ నేరుగా లబ్ధిదారుల ఖాతాకే డబ్బులు జమ చేస్తూ జవాబుదారీతనం పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. దేశంలోని ప్రజలందరికీ వన్ నేషన్ – వన్రేషన్ కార్డు అందించాలన్నదే ధ్యేయమన్నారు. కరోనా కష్టకాలం లో పేద ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు సక్రమంగా అందాయా? అని తెలుసుకున్నారు. కోటి మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రూ.2వేల చొప్పున మొదటి విడతగా రూ.10 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశామన్నా రు.
పీఎం గరీబ్ కల్యాణ్ యోజన తదితర పథకాలపై ప్రధాని ము ఖాముఖీ నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ రమేశ్ మా ట్లాడుతూ జిల్లాలో ముద్ర కార్యక్రమంలో 4,409 వీధి వ్యాపారు లకు రూ.10వేల ఆర్థికసాయం అందజేశామన్నారు. 1,854 మంది ని గుర్తించి, ఇప్పటి వరకు 393 మంది వీధి వ్యాపారులకు రెండో విడుతగా రూ.20వేల ఆర్థికసాయం అందజేశామన్నారు. కాన్ఫరెన్స్ లో లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ వేణుగోపాల్రావు, మెప్మా పీడీ ఇందిర, కో ఆర్డినేటర్లు, వీధి వ్యాపారులు పాల్గొన్నారు.