రామచంద్రాపురం, మే28: రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చిల్లర రాజకీయాలకు పాల్పడే వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని తెల్లాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రాములుగౌడ్ అన్నారు. శనివారం మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో ఎక్కడా తగ్గకుండా నిధులు కేటాయించిందన్నారు.
రెండున్నరేండ్లలోనే మున్సిపాలిటీలో రూ.45కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. మరో రూ.14కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన రూ.25 కోట్ల నిధులకు సంబంధించి ఏయే పనులు చేయాలనే దానిపైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, స్వతంత్ర కౌన్సిలర్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి రాజీనామాను తాము అంగీకరించడం లేదన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లచ్చిరాంనాయక్, బాబ్జీ, శ్రీశైలం, రవీందర్రెడ్డి, నాగరాజు, కోఆప్షన్ సభ్యుడు శ్రీపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఏఎంసీ వైస్చైర్మన్ మల్లారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్యాదవ్, నాయకులు ఉమేశ్వర్, కొమురయ్య, నర్సింహ, శ్రీకాంత్రెడ్డి, ఇందిరారెడ్డి, సాగర్, బాలయ్య, యాదగిరి పాల్గొన్నారు.