ఝరాసంగం, మే 25: ‘మనఊరు-మనబడి’తో గ్రామాల్లో ఉన్న పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. బుధవారం మం డల పరిధిలోని జీర్లపల్లి, బొప్పన్పల్లి, మేదపల్లి, కుప్పానగర్, ఎల్గొయి, బర్దిపూర్, కృష్ణాపూర్ గ్రామాల్లో మన ఊరు-మనబడి కింద మంజూరైన గ్రామాల్లో ఉన్న పాఠశాలలు నూతనంగా నిర్మాణం చేసేందుకు ఆయన భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మన ఊరు- మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాల్లో ఉన్న పాఠశాలలు శిథిలా వస్థకు చేరుకున్న వాటిని నూతనంగా నిర్మాణం చేపట్టేందుకు 2.75 కోట్లు మంజూరయ్యాయన్నారు. ‘ప్రైవేట్’కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతాయన్నారు.
అందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గ్రామాల్లో బడి, గుడి బాగుండాలంటే గ్రామస్తులు, ప్రజా ప్రతినిధుల సహకారం ఉండలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు బొగ్గుల జగదీశ్వర్, రాంరెడ్డి, అమర్జీజిత్, ఎంపీటీసీ విజేందర్రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ దిగంబర్రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మఠం రాచయ్యస్వామి, ఝరాసంగం టౌన్ అధ్యక్షుడు ఎజాజ్బాబా, టీఆర్ఎస్ నాయకలు వెంకట్రెడ్డి, సయ్యద్ ఉన్నారు.
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
వెల్దుర్తి, మే 25: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించి, కార్పొరేట్కు దీటుగా పాఠశాలలను తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో మండలంలోని మంగళపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రూ. 55.19, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ. 28.35 లక్షల ని ధులు మంజూరు కాగా బుధవారం ఎమ్మెల్యే మదన్రెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 55 లక్షలతో గ్రామంలో నిర్మించే సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ‘మన ఊరు- మనబడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించి, వాటిని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
పాఠశాలల బలోపేతానికి భారీగా నిధులను మంజూరు చేస్తున్నారని, ఈ నిధుల ద్వారా పాఠశాలల్లో అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేయనున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో, వేగంగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదర్శ గ్రా మాలుగా తీర్చిదిద్దడం కోసం నేరుగా పంచాయతీలకే నిధులు అందిస్తుండడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సుభాషిణి, ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్గౌడ్, పీఆర్ డీఈ రాధిక, తహసీల్దార్ సురేశ్, సర్పంచ్ రామకృష్ణారావు, ఎంపీటీసీ అడివయ్య, నాయకులు నరేందర్రెడ్డి, ఆంజనేయులు, రమేశ్, కృష్ణ, మహేందర్, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.