కొండపాక, మే 25 : టీఆర్ఎస్ హయాంలోనే గ్రామా లు అభివృద్ధి చెందాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మండలంలోని ముద్దాపూర్లో బుధవారం బొడ్రాయి ప్రతిష్ఠలో ఆయ న పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గ్రామంలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం అత్యాధునికంగా ఉందని కితాబిచ్చారు. సీసీ రోడ్డు వేయడం కోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలో పింఛన్లు మంజూరవుతాయన్నారు. సొంతస్థలం ఉన్న వారికి ఇండ్లు నిర్మించుకోవాడానికి రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావుని సర్పంచ్ తూ ము ఉమాఅంజిరెడ్డి సత్కరించారు. మంత్రి వెంట ఎ మ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో పాటు ఎంపీపీ సుగుణ, వైస్ ఎంపీపీ రవీందర్, ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు కోల సద్గుణ, రైతు బంధు సమితి కన్వీనర్ దుర్గయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమార్యాదవ్, శ్రీకాంత్రెడ్డి, పీఎన్ఆర్ సంస్థ చైర్మన్ నరేందర్ పాల్గొన్నారు.
పలు వివాహాలకు హాజరైన మంత్రి హరీశ్రావు
సిద్దిపేట,మే 25: పట్టణంలోని పలు వివాహాలకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొండ మల్ల య్య గార్డెన్లో జరిగిన ఆరుట్ల సూర్యకాంత్రెడ్డి-రుచిత, పోలీస్ కన్వెన్షన్ హాల్లో ముష్ణం వారి పెండ్లికి, గంగపుత్ర కమ్యునిటీ హాల్లో కూస వారి పెండ్లికి హాజరై హరీశ్-నూతన శ్రీ,తాడురి బాలగౌడ్ ఫంక్షన్హాల్లో నర్సింహస్వామి-అనీషాల పిండ్లికి, నిమ్రా గార్డెన్లో లక్కరసు వారి పెండ్లికి హాజరై నవ్యశ్రీ-పరమేశ్వర్,లావణ్య గార్డెన్లో జరిగిన చిట్యాల సత్య నారాయణగౌడ్ కుతూరు వైశాలి-క్రాంతిగౌడ్ పెండ్లికి హాజరై వధూ వరులను ఆశ్వీరదించారు.