సంగారెడ్డి కలెక్టరేట్, మే 25: పదో తరగతి వార్షిక పరీక్షలు సంగరెడ్డి జిల్లాలో బుధవారం ప్రశాంతంగా జరిగా యి. మూడో రోజు పరీక్షలో భాగంగా మొత్తం 22,549 మందికి 22,348 మంది, 99.11 శాతం హాజరయ్యారు. కాశీపూర్లోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ లో అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. సంగారెడ్డితో పాటు రామచంద్రపురం, బీహెచ్ఈఎల్, తెల్లాపూర్ పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్ పరిశీలించారు.
మెదక్ జిల్లాలో 98.92 శాతం హాజరు
మెదక్ మున్సిపాలిటీ, మే 25: పదో తరగతి పరీక్షలకు మెదక్ జిల్లాలో బుధవారం 98.92 శాతం హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 72 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 11,394 మందికి 11,271 మంది విద్యార్థులు హాజరయ్యారు. చిన్న శంకరంపేట, చేగుంట మండలాల్లోని 5 పరీక్షా కేంద్రాలను డీఈవో సందర్శించారు. వెల్దుర్తి, శివ్వంపేట, నార్సింగి, పాపన్నపేట, కౌడిపల్లి మండలాల్లోని 18 పరీక్షా కేంద్రాలను ప్రత్యేక స్కాడ్ బృందాలు తనిఖీలు చేశారు.
డూప్లికేట్ హాల్టికెట్తో హాజరు
వెల్దుర్తి, మే 25: మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ లక్ష్మి కుమారుడు మనీశ్కుమార్ బండపోసాన్పల్లి ఉన్నత పాఠశాలలో పది పరీక్షలు రాస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం వారి పూరిగుడిసె దగ్ధమైంది. దీంతో గుడిసెలో ఉన్న మనీశ్ పుస్తకాలు, హాల్టికెట్ కాలిపోయాయి. దీంతో బుధవారం పరీక్షకు హాజరైన మనీశ్కుమార్కు ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఖదీర్ డూప్లికేట్ హాల్టికెట్ అందించారు.