మెదక్ మున్సిపాలిటీ/ పెద్దశంకరంపేట/ నిజాంపేట/ తూప్రాన్/ కొల్చారం, మే 21 : జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర దేవాలయ బ్రహోత్సవాలు పురస్కరించుకొని శనివారం శ్రీనివాస, పద్మావతీ కలాణోత్సవాన్ని వేదపండితుడు అభిషేక్ చార్యులు, యజ్ఞాచార్యులు నరేంద్రచార్యులు, రంగచార్యులు, పణీంద్రచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. కల్యాణానికి ముందు స్వామివారికి పల్లకీలో ఎదుర్కోళ్లు నిర్వహించారు. కల్యాణ ఉత్సవాలకు ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, హావేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డితో కలిసి వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు కంచి మధుసూదన్, కమిటీ సభ్యులు నాగరాజు, వెంకన్న, భక్తులు పాల్గొన్నారు.
నేడు నల్ల పోచమ్మ అమ్మవారి బోనాలు
జిల్లాకేంద్రంలో ఆదివారం మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ అమ్మవారి బోనాలు నిర్వహిస్తున్నట్లు మున్నూరుకాపు సంఘం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు నాగభూషణం, ఆకుల రాంకిషన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బట్టి ఉదయ్ తెలిపారు. ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డితోపాటు మున్నూరుకాపు సంఘం నాయకులు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆదివారం సాయం త్రం రాందాస్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్, గోల్కోండ వీధి మీదుగా ఆటోనగర్లోని నల్లపోచమ్మ దేవాలయానికి బోనాల ఊరేగింపు ఉంటుందన్నారు. నల్ల పోచమ్మ దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.
ప్రారంభమైన మాణిక్ప్రభు జాతర
పెద్దశంకరంపేట మండలంలోని లక్ష్మాపూర్లో మాణిక్ ప్రభు జాతర ప్రారంభమైనది. ఆలయంలో స్వామివారికి ప్రత్యే క పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి మహిళలు బోనాలను సమర్పించారు. ఉత్సవాల్లో సర్పంచ్ కవితా రమేశ్, ఉప సర్పంచ్ పోచయ్య, నాయకులు పాల్గొన్నారు.
వైభవంగా గంగాభవానీ కల్యాణ మహోత్సవం
నిజాంపేట మండలంలోని కల్వకుంటలో గంగపుత్ర సం ఘం ఆధ్వర్యంలో గంగాభవానీ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాల ను ఘనంగా నిర్వహించారు. వేద పండితులు రామ్మోహన్శర్మ, విశ్వేశ్వరశర్మ ఆధ్వర్యంలో గంగాభవానీ అమ్మవారి కల్యాణం నిర్వహించారు. పీఏసీఎస్ చైర్మన్ కొండల్రెడ్డి, వైస్ ఎంపీపీ ఇందిర అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
కోనాయపల్లి (పీబీ)లో పెద్దమ్మ బోనాలు
తూప్రాన్ మండలం కోనాయపల్లి (పీబీ)లో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో పెద్దమ్మ బోనాలు నిర్వహించారు. శనివారం విశేష పూజలు, పెద్దమ్మ తల్లి కల్యాణోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతా ప్రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, సర్పంచ్ కంకణాల పాండు, కోనాయపల్లి ఉప సర్పంచ్ ఉప్పరి రమ్యాశంకర్, మల్కాపూర్ ఎంపీటీసీ వెంకటమ్మ, ఉప సర్పంచ్ పంజాల ఆంజనేయులు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు విఠల్ పాల్గొన్నారు.
నేటినుంచి వెంకటాపూర్లో వేంకటేశ్వరుడి ఉత్సవాలు
కొల్చారం మండలంలోని వెంకటాపూర్లో ఆది, సోమవారాల్లో లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పోతంశెట్పల్లి పట్వారీ ప్రసాదరావు తెలిపారు. ఆదివారం ఉదయం అభిషేకం, అలంకరణతోపాటు లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం పల్లకీసేవ, సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఉత్సవాలకు తరలిరావాలని కోరారు.