మనోహరాబాద్, మే 21 : సీఎం కేసీఆర్ అమలు చేసిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్రెడ్డి పేర్కొన్నారు. మనోహరాబాద్ మండలం రామాయిపల్లిలో శనివారం ఆయన మా ట్లాడుతూ…తెలంగాణ ఏర్పడిన ఏడున్నర ఏండ్లలోనే మారుమూల గ్రామాలు అద్భుతమైన పురోగతిని సాధించాయన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో ప్రజల్లో చైతన్యం వచ్చిందని, చెత్తచెదారం లేని గ్రా మాలుగా మారాయన్నారు. హరితహారం కార్యక్రమంతో పల్లెలో పచ్చదనం వెల్లివిరుస్తుందన్నారు. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు నీడనిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ రైతుబాంధవుడని, రైతు కష్టాలు ఆయన కు తెలుసని, రైతు సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి సీఎం కావడం మన అదృష్టమన్నారు. హల్దీవాగుపై చెక్డ్యాంలను నిర్మించి రైతులకు నీటి కష్టాలను తీర్చారన్నారు. హల్దీవాగులోకి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను వదిలడంతో మండుటెండల్లో సైతం నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయన్నారు. మెదక్ జిల్లాకు కోర్డు వచ్చేలా కృషి చేసినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రతన్లాల్, స్థానిక నాయకుడు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.