జగదేవ్పూర్, మే 20 : ఆయిల్పామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని ఫారెస్టు కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మునిగడప రైతు వేదికలో వానకాలం పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన సాగు ఖర్చులను తగ్గించేందుకు రైతులు సేంద్రియ పంటలు పండించాలని సూచించారు. వానకాలం పంట సాగులో జీలుగ, జనుము వేసుకొని దుక్కులను కలియదున్నినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. ఆయిల్పామ్ పంట సాగుకు ప్రభుత్వం పోత్సాహం అందిస్తున్నదన్నారు. రైతులు ఆయిల్పామ్ పంటలపై దృష్టి సారించాలని తెలిపారు. మితిమీరిన ఫర్టిలైజర్ ఎరువుల వాడడంతో భూసారం దెబ్బతింటుందని, దీంతో దిగుబడులు తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోతారని తెలిపారు. నియోజకవర్గంలో 1500 మంది రైతులతో త్వరలో రైతు అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సరోజని, ఎంపీపీ బాలేశంగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, మం డల వ్యవసాయ అధికారి మల్లేశం, సర్పంచ్ బాల్లక్ష్మి, ఆత్మ కమిటీ డైరెక్టర్ బాలకిషన్, రైతులు పాల్గొన్నారు.
టీ హౌస్ ప్రారంభం..
జగదేవ్పూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీహౌస్ను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి శుక్రవారం మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధితో యువత రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎం పీపీ బాలేశంగౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ రంగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీ కవితాశ్రీనివాస్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు ఎక్బాల్ పాల్గొన్నారు.
ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలి..
సిద్దిపేట అర్బన్, మే 20 : రైతులు ఆయిల్పామ్ సాగు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్ అన్నారు. మండల కేంద్రమైన నారాయణరావుపేటలో ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నిరంతర ఆదాయం ఇచ్చే ఆయిల్పామ్ పంట సాగు చేయాలని సూ చించారు. అనంతరం గుర్రాలగొంది, జక్కాపూర్ గ్రామా ల్లో ఉన్న రైతు వేదికలను ఆయన పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ పద్మ, ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, వైస్ ఎంపీపీ సంతోశ్కుమార్, ఏవో ప్రకాశ్గౌడ్, మండల ఉద్యానశాఖ అధికారి భాస్కర్రెడ్డి, సెరీకల్చర్ ఆఫీసర్ ఇంద్రసేనారెడ్డి, ఏఈవోలు నాగార్జున, మీనాక్షి, మౌనిక, సర్పంచ్లు దేవయ్య, శంకర్ పాల్గొన్నారు.
అనుకూలమైన పంటలు సాగు చేయాలి..
దుబ్బాక, మే 13 : వానకాలంలో అనుకూలమైన పంటలు సాగు చేయాలని దుబ్బాక ఏవో ప్రవీణ్ రైతులకు సూచించారు. శుక్రవారం దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి రైతు వేదికలో వానకాలం పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగుతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. పంట మార్పిడి, వెద సాగు, పచ్చిరొట్టె, ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి ఏఈవో కవిత, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్లు, రైతులు పాల్గొన్నారు.
వానకాలం పంటల సాగుపై అవగాహన..
బెజ్జంకి, మే 20 : మండలంలోని గాగిల్లాపూర్, దా చారం, బెజ్జంకి గ్రామాల్లోని రైతు వేదికల్లో వానకాలం పంటల సాగుపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పచ్చిరొట్టె ఎరువులు, ఆయిల్పామ్, మల్బరీ ఇతర లాభదాయకమైన పంటల సాగుపై వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మండలాధికారి సంధ్య, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.