మెదక్ రూరల్/ రామాయంపేట, మే 19 : ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులను అకాల వర్షాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం భరోసానిచ్చింది. కేంద్రం ధాన్యం కొన కున్నా సీఎం కేసీఆర్ రైతులకు బాసటగా నిలిచారు. మెదక్ మం డలంలో ఆయా గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం జిల్లా, మండలస్థాయి అధికారులు సందర్శించి, కొనుగోళ్లను పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగో లు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
మెదక్ మండలంలో మొత్తం 25 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో మెదక్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో 21, డీసీఎంసీ ఆధ్వర్యంలో 1, మాచవరం పీఏసీఎస్ ఆధ్వర్యంలో -2, ఏఎంపీ అధ్వర్యంలో 1 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు కేంద్రాలను సందర్శిస్తూ ధా న్యం కొనుగోళ్లను వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. తడిసిన ధాన్యాన్ని శుభ్రపరిచి తూకం చేయాలని కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలను అధికారులు ఆదేశించారు.
తరుగు పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు
రైతుకు మద్దతు ధర కల్పించడానికే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని మెదక్ మండల తహసీల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మెదక్ మండలంలోని పాతూరు, వేంకటాపూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్ఐ చం ద్రశేఖర్తో కలిసి పరిశీలించారు. మాచవరంలోని మంజీరా రైస్మిల్లు గోదాం పరిశీలించి, లారీల్లో వచ్చిన ధాన్యాన్ని వెం టనే ఖాళీ చేయించాలని ఆదేశించారు. మిల్లు సామర్థానికి అనుగుణంగా గోదాం సిద్ధం ఉంచాలని సూచించారు. ధాన్యం తూ కాల్లో మోసాలు, కాంటా వేసిన బస్లాల్లో తరుగు పేరుతో రైతులను మోసం చేసే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం తడవకుండా రైతులందరూ టార్పాలిన్లు వేయాలన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసినా కొనుగోలు చేస్తామని, రైతు లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో నాయకుడు బాలయ్య, రైస్మిల్లుల యాజమానులు ఉన్నారు.
చివరి గింజ వరకూ కొంటాం : ఆర్డీవోసాయిరాం
రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనివాస్, మెదక్ ఆర్డీవో సాయిరాం పేర్కొన్నారు. రామయంపేట మండలంలోని ధర్మా రం(డీ) గ్రామంలో పర్యటించారు. ధాన్య తూకం వేయాలని రైతులు కోరారు. వెంటనే రైస్మిల్లుల నిర్వాహకులతో మాట్లా డారు. తూకం వేసిన బస్తాలను లారీల్లో వేయించి, నేరుగా రైస్ మిల్లుకు తరలించారు. ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ప్రతి రైతుకు టార్పాలిన్లు అందజేస్తామన్నారు. రైస్మిల్లులో ధాన్యం లారీలను వెంటనే ఖాళీ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో రామాయంపేట మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్రావు, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, పీఏసీఎస్ సీఈవో నర్సింహులు, డైరెక్టర్లు దుర్గారెడ్డి, శ్రీనివాస్ ఉన్నారు.