మనోహరాబాద్, మే 18 : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం రామాయిపల్లిలో సీఎంఆర్ దవాఖాన, కండ్లకొయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సేవాతత్వంతో స్వచ్ఛంద సంస్థలు పల్లెలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఎలక్షన్రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నవనీతారవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రతన్లాల్, సర్పంచ్ పార్వతీమల్లేశ్, ఉప సర్పంచ్ వెంకటేశ్, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, దవాఖాన చైర్మన్ గోపాల్రెడ్డి, వార్డు సభ్యులు అనురాగ్రెడ్డి, దుర్గాప్రసాద్రెడ్డి, భానుప్రదీప్, డైరెక్టర్లు రాంచరణ్, హారిక పాల్గొన్నారు.
నేడు బాలానగర్లో మోగాహెల్త్ క్యాంప్
మెదక్ రూరల్, మే 18 : మెదక్ మండలంలోని బాలానగర్లో రేనోవా దవాఖాన (కొంపల్లి) సిబ్బంది గురువారం వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ వికాస్కుమార్ తెలిపారు. రేనోవా దవాఖాన సిబ్బంది గ్రామంలో ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేస్తారని వివరించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.