పటాన్చెరు, మే18: పటాన్చెరులోని డివిజన్ 113లో జీవీఆర్ ఎంటర్ ప్రైజెస్ సహకారంతో రూ.2 కోట్ల సీఎస్సార్ నిధులతో ముస్లిం, మైనార్టీ ఫంక్షన్ హాల్ నిర్మించారు. ఈ ఫంక్షన్ హాల్ను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గురువారం ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్ని తానై ఈ ఫంక్షన్ హాల్ పనులు పూర్తి చేయించారు.
రెండు దశాబ్దాల కల సాకారం
పటాన్చెరులో షాదీఖానా నిర్మాణం రెండు దశాబ్దాల కల. సమైక్య పాలనలో 2001లో రూ.6 లక్షలతో తూతూ మంత్రంగా నిర్మించారు. కనీస సౌకర్యాలు లేకుండా నాసిరకం పనులు చూసిన అప్పటి మైనార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ విషయాన్ని ఇప్పటి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తక్షణమే స్పందించి దాని స్థానం లో కొత్త ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు ప్రతిపాదనలు చేశారు. జీవీఆర్ ఎంటర్ ప్రైజెస్ సహకారంతో సీఎస్సార్ నిధులు, తన సొంత నిధులు కూడా ఖర్చు చేసి ఈ హాల్ను నిర్మించారు. అన్ని హంగులతో రెండంతస్థుల్లో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
అన్ని హంగులతో…
ముస్లింల వివాహాలకు అవసరమైన డిజైన్తో, సకల సౌకర్యాలతో షాదీఖాన నిర్మించారు. వివాహాలతో పాటు ఇతర ఫంక్షన్లు చేసుకునేందుకు అనువుగా ఈ ఫంక్షన్ హాల్ను నిర్మించారు. పెద్ద హాళ్లతోపాటు భోజనాలు చేసేందుకు అనువుగా డైనింగ్ హాల్, వంటలు వండేందుకు కిచెన్, పూర్తి స్థాయిలో లైటింగ్, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటుచేశారు. చుట్టూ కంపౌండ్ వాల్ ఏర్పాటు చేశారు. టాయిలెట్స్, ఇతర సౌకర్యాలు కల్పించడంతో అన్ని హంగులతో ఫంక్షన్హాల్ పూర్తి చేశారు.
ఎమ్మెల్యే ప్రత్యేక పర్యవేక్షణలో..
ఎమ్మెల్యే స్వయంగా, తరచుగా వచ్చి ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించడంతో షాదీఖానా వేగంగా నిర్మితమైంది. నిధులు, నాణ్యతలో ఎమ్మెల్యే సహకారాన్ని మైనార్టీలు కొనియాడుతున్నారు.
నేడు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ రాక
పటాన్చెరులో నిర్మించిన ముస్లిం మైనార్టీ ఫంక్షన్ హాల్ను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ నేడు ప్రారంభించనున్నారు. ఆయనతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి కూడా హాజరుకానున్నారు.
ముస్లింలంతా ఉపయోగించుకోవాలి
మైనార్టీలు ఫంక్షన్ల కోసం బయటకు వెళ్లవద్దు. నియోజకవర్గంలోని ముస్లింలంతా ఫంక్షన్ హాల్ను ఉపయోగించుకోవాలి. షాదీముబారక్ పథకంతో ముస్లిం యువతుల వివాహాలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. ఈ ఫంక్షన్ హాల్ అందుబాటులోకి రావడంతో ముస్లింలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
– గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్యే, పటాన్చెరు
టీఆర్ఎస్తోనే ముస్లింల అభివృద్ధి
టీఆర్ఎస్తోనే ముస్లింల అభివృద్ధి సాధ్యమవుతున్నది. పటాన్చెరులో షాదీఖానా కావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే స్పందించారు. సొంత ఖర్చుతో ఫంక్షన్ హాల్లో అన్ని హంగులు ఉండేలా నిర్మించా రు. ఆధునిక సదుపాయాలు కూడా కల్పించారు. ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు.
– లియాకత్ అలీ,మైనార్టీ నాయకుడు, పటాన్చెరు