మనోహరాబాద్/ రామాయంపేట/ రామాయంపేట రూ రల్, మే 12 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ తెలిపారు. మనోహరాబాద్ జడ్పీ క్యాంపు కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజే శారు. వెంకటాపూర్ అగ్రహారానికి చెందిన దోమల స్వామికి రూ. 32,500, పర్కిబండకు చెందిన గూడూరి గణేశ్కు రూ. 20వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పేదలకు కార్పొరేట్స్థాయి లో మెరుగైన వైద్యాన్ని అందించడానికి సీఎం కేసీఆర్ ప్రతి మండలంలో ప్రభుత్వ దవాఖానను కేటాయిస్తున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్ ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, నాయకులు మన్నె నాగరాజు, రమేశ్గౌడ్, శ్రీరామ్, సర్పంచ్లు రేణుకాఅంజనేయు లు, పార్వతీమల్లేశ్, మాధవరెడ్డి, నాగభూషణం ఉన్నారు.
సీఎం కేసీఆర్ ఆదర్శమూర్తి : కౌన్సిలర్ యాదగిరి
సీఎం కేసీఆర్ ఆదర్శమూర్తి అని, ప్రజలకు ఏ ఆపద వచ్చి నా నేనున్నానంటూ ఆదుకుంటున్నారని రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్ దేమె యాదగిరి అన్నారు. దవాఖానలో చికిత్స కోసం బాధితులను సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నారన్నారు. పట్టణంలోని 6వ వార్డుకు చెందిన టప్పా హేమలతకు రూ.36వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.
నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసా..
పేదలకు ఆపద సమయాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ శ్రీరామ రక్షగా నిలుస్తున్నదని టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు శ్రీకాంత్ సాగర్ అన్నారు. రామాయంపేట మండ లంలోని అక్కన్నపేట గ్రామంలో బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన రాగి నాగరాజు, స్వప్న దంపతుల కుమారుడు గిరీశ్కుమార్వైద్య చికిత్సకు రూ.28వేలు మంజూ రైనట్లు తెలిపారు. పేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసాగా నిలుస్తు న్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మహేశ్, జంగం యాదగిరి, నందు, శివకుమార్ పాల్గొన్నారు.