మెదక్ రూరల్,జూన్ 29: ప్రభుత్వం నిర్వహిస్తున్న నాల్గోవిడత పల్లెప్రగతికి అందరు కృషి చేయాలని జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి అన్నారు. మెదక్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి ఆర్డీవో సాయిరాం, ఎంపీపీ యమునా జయరాంరెడ్డి, ఎంపీడీవో శ్రీరాములు, మండల అధికారులు, సర్పంచ్లు ,పంచాయతీ కార్యదర్శిలు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో నాల్గో విడుత పల్లె ప్రగతి 1జూలై నుంచి 10వరకు నిర్వహించే ప్రణాళిక గురించి తెలియజేశారు . ఈ సందర్భంగావారు మాట్లాడుతూగ్రామాల్లో పారిశుధ్యం పనులు పచ్చదనానికి ప్రాధాన్యమిచ్చి పనులు పూర్తి చేయాలని సూచించారు.వైకుంఠధామాలను, డంపి ంగ్ యార్డు పనులను పూర్తి చేయాలన్నారు.ఏడో విడుత హారితహారంలో భాగంగా ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయాలన్నారు. అంగన్వాడీలు, ప్రభుత్వ కా ర్యాలయాల ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు పంచాయతీ కార్యదర్శులు ప్రతి రోజూ ఈ పంచాయతీ వె బ్-సైట్లో పల్లెప్రగతి నివేదికను అప్లోడ్ చేయాలన్నారు. రాష్ట్రస్థాయి నుంచి ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించినప్పుడు ఆశించిన స్థాయి లో లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యకమంలోఏపీవో ఆదినారాయణ, ఏపీఎం నయీం ,మిషన్ భగీరథ ఏఈ సుధాకర్ ,పంచాయతీ ఏఈ సల్మాన్ , సర్పంచ్లు ఎంపీటీసీలు శ్రీహరి , పంచాయతీ కార్యదర్శిలు ఉన్నారు.
చిట్యాల సర్పంచ్ వెకటేశం అన్నారు మంగళవారం మెదక్ మండలంలోని చిట్యాలలో సర్పంచ్ వెంకటేశం ఏడో విడుత హరితహారంలో భాగంగా గ్రామంలో మొక్కలను నాటి ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఆరుమొక్కలు నాటాలన్ని సూచించారు. గ్రామ ం లో 10 వేల మొక్కలను నాటేందుకు ప్రణాళికను రూ పొందించామన్నారు
మండలాన్ని అగ్ర స్థానంలో నిలపాలి
పెద్దశంకరంపేట,జూన్ 29: పల్లెప్రగతితో పాటు ఏడో విడుత హరితహారం మొక్కలు నాటడంలో జిల్లాలో పెద్దశంకరంపేట మండలాన్ని అగ్రస్థానంలో నిలపాలని ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో అధికారులు, ప్ర జాప్రతినిధులు సమన్వయం తో పనిచేస్తూ లక్ష్యాన్ని పూర్తి చే యాలన్నారు. మండలంలోని గ్రామాల్లో వైకుంఠధామాలు , డంపింగ్ యార్డులు, రైతువేదికలు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జ్ఞానేశ్వర్, ఎంపీడీవో రామ్నారాయణ, ఎంపీవో రియాజొద్దిన్, ఏపీవో సుధాకర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు తదితరులున్నారు.
పట్టణాన్ని హరితమయంగా మార్చుకుందాం
మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 29 : పట్టణాన్ని హరితమయంగా చేయాలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ప్రధాన రోడ్డు డివైడర్ల మధ్య మొక్కలు నాటించారు
పాపన్నపేట…
పాపన్నపేట,జూన్ 29: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పాపన్నపేట మండల ప్రత్యేక అధికారి, అసిస్టెంట్ పీడీ భీమయ్య, మండల పరిషత్ అధ్యక్షురాలు చందనా ప్రశాంత్రెడ్డి సూచించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం పాపన్నపేటలో పల్లె ప్రగతి సన్నాహక సమావేశం ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు