మెదక్ మున్సిపాలిటీ, మార్చి 30: పదో తరగతి పరీక్షలు ఈ యేడు ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పదో తరగతి పరీక్షల విధానంపై బోర్డు ఈ నెల 11వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న 11పేపర్లకు బదులుగా ఈసారి ఆరు పరీక్షలే నిర్వహించాలని ఒక్కో సబ్జెక్ట్కు ఒక పరీక్ష మాత్రమే ఉండాలని నిర్ణయించారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో జిల్లాలోని పాఠశాలల్లో హాజరుశాతం మెరుగుపడింది.
గతేడాది కరోనా నేపథ్యంలో 11పేపర్లకు బదులు ఆరు పేపర్లకు కుదించారు. కానీ కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వాహణ సాధ్యం కాకపోవడంతో పరీక్షలు రాయకుండానే అందరినీ ఉతీర్ణులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం తగ్గడంతో ఈసారి మాత్రం ఆరు పరీక్షలే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 11నుంచి మే 20వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
మే 16న జరిగే జనరల్ సైన్స్ పరీక్ష మా త్రం ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ ప్రశ్న పత్రాల ఆన్సర్ షీట్లు వేర్వేరుగా ఇవ్వనున్నారు. 70 శాతం సిలబస్తోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. పరిస్థితులన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి విద్యాశాఖ అధికారులు పరీక్ష విధానంలో మార్పులు తీసుకొచ్చారు.
ఒక్కో పరీక్షకు 3:15గంటల సమయం..
పదో తరగతి పేపర్లు తగ్గించడంతో పరీక్షల సమ యం అరగంట పెంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఒక్కొ పరీక్ష 3గంటల 15నిమిషాల పాటు జరుగనున్నది. సైన్స్ పరీక్షలో భౌతిక, జీవశాస్ర్తాలకు వేర్వేరు సమాధాన పత్రా ల ఉండనున్నాయి. బోర్డు పరీక్షకు 80మార్కులు, ఫార్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలకు 20 మార్కులు చొప్పున కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.