ఏడుపాయల రథం ఏర్పాటుకు ఆర్థిక సాయం
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ద్వారా ఆలయ కమిటీకి అందజేత
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 25;ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో నూతన రథం ఏర్పాటుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన వేతనం నుంచి రూ. 5 లక్షల విరాళం చెక్కును ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ద్వారా ఆలయ కమిటీకి శుక్రవారం అందజేశారు. దుర్గామాతపై భక్తితో తన వంతుగా ఉడతా భక్తితో విరాళాన్ని అందజేస్తున్నట్లు కవిత చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో కవిత ఏడుపాయల వనదుర్గా మాతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.