తూప్రాన్, ఆగస్టు 8 : విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మల్టీజోన్ -1 ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ ఒలింపియా స్కూల్లో అంతర్ జిల్లా ఖోఖో క్రీడాపోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు.
అనంతరం అల్లాపూర్ శివారులోని జాతీయ రహదారిపై ఉన్న టోల్ప్లాజాలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఐజీ సందర్శించి, సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను పరిశీలించారు. ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు, అదనపు ఎస్పీ విక్రాంత్కుమార్, డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ వెంకటరాజాగౌడ్, ఎస్సై గంగరాజు, పాఠశాల కరస్పాండెంట్ శౌరలమ్మ, చైర్మన్ జనార్దన్రెడ్డి, వైస్ చైర్మన్ జైపాల్రెడ్డి, ప్రిన్సిపాల్ రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ వనిత, పీఈటీ మధుసూదన్, ఆయా జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.