మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
చిన్నశంకరంపేట పట్టణంలో పర్యటన
చిన్నశంకరంపేట, మార్చి 25 : కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం పట్టణంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేసి, వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. చందంపేటలో హెల్త్ సబ్సెంటర్ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంగన్వాడీ భవనం ముందు సీసీరోడ్డు పనులను ప్రా రంభించారు. చందంపేట జడ్పీ పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి, మెను ప్రకారం నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని వంట నిర్వాహకులకు సూచించారు. రుద్రారం అంగన్వాడీ కేంద్రం తోపాటు, మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఎమ్మెల్యే అక్షరాభ్యాసంతో పాటు గర్భి ణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు.
కొర్విపల్లి లో హెల్త్సబ్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గజగట్లపల్లి గ్రామంలో పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వానివి ప్రజా వ్యతిరేక విధానాలన్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఏప్రిల్ నుంచి సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తుందన్నారు. యాసంగిలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మం లో ఎంపీపీ భాగ్యలక్ష్మి, ఏఎంసీ వైస్చైర్మన్ రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు, ఎంపీడీవో గణేశ్రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ శ్రావణి, ఎంపీటీసీలు శివకుమార్, యాదగిరి, సర్పంచ్లు యాదగిరియాదవ్, శ్రీలతాలక్ష్మణ్, పద్మ, మీనాజ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు స్వామిరాజ్, మల్లేశం, రవీందర్, ప్రభాకర్, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.