తూప్రాన్ రూరల్, జూన్ 19: మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్మించిన పల్లెప్రకృతి వనాలతో ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేందుకు, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడిపేందుకు దోహదపడుతాయని డీఆర్డీవో ఏపీడీ స్వప్న అన్నారు. తూప్రాన్ మండలం ఘనపూర్, యావాపూర్లలో ఏర్పాటైన పల్లెప్రకృతి వనాలను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లెప్రకృతి వనాల్లో నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ వాటిని సంరక్షించాలన్నారు. పల్లెప్రగతిలో గ్రామాల్లోని రోడ్లు,వీధులకు ఇరువైపుల, ఇండ్ల పరిసరాల్లో హరితహారం మొక్కలను నాటి వాటిని ఏపుగా పెంచాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో అరుంధతి, ఎంపీవో రమేశ్, ఏపీవో సంతోష్రెడ్డి, ఆయా గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
పల్లెకే అందాన్నిస్తున్న ప్రకృతివనం
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు పల్లెలకే అందాలను ఇస్తున్నాయని రామాయంపేట మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రావు, ఎంపీడీవో యాదగిరిరెడ్డి అన్నారు.శనివారం సుతారిపల్లి గ్రామంలో పల్లెప్రకృతి వనాన్ని, డంపింగ్ యార్డును పరిశీలించి మాట్లాడారు. గ్రామస్తులు ఐక్యమత్యంగా ఉండి చిన్నపల్లెను అభివృద్ధి చేసుకోవడం మంచి పరిణామమన్నారు. గ్రామ శివారులో రోడ్డు పక్కనే అందరినీ ఆకర్శించేలా ప్రకృతి వనం నిర్మించుకోవడం సంతోషాన్ని ఇస్తుందన్నారు. పల్లె ప్రకృతి వనంలో చిన్న పిల్లలకు ఆటవిడుపు కోసం ఆట వస్తువులు ఏర్పాటు, మంచి గార్డెన్ చక్కగా ఉందన్నారు. డంపింగ్ యార్డులో తడిపొడి చెత్తను వేరుచేసి ఎరువులుగా తయారు చేయడం బాగుందన్నారు.అధికారుల వెంట సర్పంచ్ రాగి సంధ్య, కార్యదర్శి పద్మ, టీఆర్ఎస్ నాయకుడు ఉమామహేశ్వర్ ఉన్నారు.