ఝరాసంగం, జూలై20: కురుస్తున్న వర్షాలతో రైతన్నలు మురుస్తున్నారు. సాగుచేసిన పంటలు కళకళలాడుతున్నా యి. వ్యవసాయ పొలాల్లో మహిళలు కలుపుతీత పనుల్లో నిమగ్నమయ్యారు. కొంతమంది రైతులు మొక్కలకు ఎరువులు చల్లుతుండగా, మరికొంత మంది విత్తనా లు విత్తుతున్నారు.
ఈసారి పత్తి, జొన్న, పెసర, మొక్కజొన్న, సోయాబీన్ విత్తనాలు అధికంగా రైతులు సాగు చేశారు. ప్రభుత్వం పంటల సాగు కోసం రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం ఎకరాకు రూ. 5వేలు ఇచ్చింది. దీంతో రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. రోహి ణి కార్తెలో విత్త న పంటలు మొలకెత్తి కళకళలాడుతున్నాయి. దీంతో రైతు లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.