నర్సాపూర్, డిసెంబర్ 18 : తెలంగాణ ప్రభుత్వం గిరిజన తండాల అభివృద్ధ్దికి అనేక విధాలుగా కృషి చేస్తున్నది. ఇప్పటికే తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల ఆత్మగౌరవాన్ని పతాక స్థాయికి చేర్చింది. గత పాలకుల నిర్లక్ష్యంతో తండాలు అభివృద్ధ్దికి నోచుకోక దూరంగా ఉన్నా యి. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ్దతో గిరిజన తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చెందుతున్నాయి. ప్రభు త్వం రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ్ద వహిస్తున్నది. ముఖ్యంగా గ్రామీల్లో రోడ్ల నిర్మాణం చేపట్టి పల్లెవాసులకు మెరుగైన రవా ణా సౌకర్యాన్ని కల్పించింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణాలను చేపట్టి పల్లెవాసులకు రవా ణా సౌకర్యం మెరుగైనది. గిరిజను లకు రవాణా సౌకర్యం సక్రమంగా ఉండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ నర్సాపూర్ నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించారు. నర్సాపూర్,కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచెడ్, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లోని గిరిజన తండాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులను మంజూరయ్యాయి.
తండాల్లో బీటీ రోడ్లకు రూ.69.41 కోట్లు మంజూరు
నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్,కౌడిపల్లి, కొ ల్చారం, చిలిపిచెడ్, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లోని గిరిజ నులు బీటీ రోడ్లు లేక అవస్థలకు గురయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులు బీటీ రోడ్లు నిర్మించాలని ఎమ్మెల్యే మదన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గిరిజనులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిం చాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్కు వివరించారు. ఫలితంగా ప్రభుత్వం రాష్ట్రంలో నర్సాపూర్ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు బీటీ రోడ్ల నిమిత్తం రూ.69.41 కోట్ల నిధులు మంజూరు చేసింది.
బీటీ రోడ్లు మంజూరైన గ్రామాలు
A, నర్సాపూర్ మండలం
1, చిన్నచింతకుంట గ్రామం నుంచి జగ్యాతండా, రూప్లా తండా మీదుగా అల్లీపూర్ పీడబ్ల్యూ రోడ్డు వరకు. మొత్తం 2.30కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ. 170లక్షలు మంజూరు.
2, అహ్మద్నగర్ జడ్పీ రోడ్డు నుంచి పోచమ్మ తండా వరకు 3.10 కి.మీ నిర్మాణానికి రూ. 230 లక్షలు.
3, మంతూర్ జడ్పీ రోడ్డు నుంచి తిర్మలాపూర్ వసురాంతండా వరకు 2.20 కి.మీ నిర్మాణానికి రూ.161లక్షలు.
4, అల్లీపూర్ పీడబ్ల్యూ రోడ్డు నుంచి తుజాల్పూర్ జడ్పీ రోడ్డు వయా వాల్యాతండా వరకు. మొత్తం 3.55 కి.మీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.263 లక్షలు మంజూరు.
5, ఇబ్రహీంబాద్ జడ్పీ రోడ్డు నుంచి హెచ్ఎంబీ రోడ్డు వయా రంజ్యాతండా వరకు 2.20 కి.మీ రూ.161 లక్షలు.
6, గూడెంగడ్డ జడ్పీ రోడ్డు నుంచి ధర్మాతండా వరకు 2.45 కి.మీ నిర్మాణానికి రూ.182 లక్షలు మంజూరు.
B, శివ్వంపేట
1, నవాబ్పేట్ నుంచి గుమ్మడిదల వయా రాములుతండా వరకు 2 కి.మీ నిర్మాణానికి రూ.141 లక్షలు.
2, అల్లీపూర్ పీడబ్ల్యూడీ నుంచి కొత్తపేట్ వయా పకీరాతండా వరకు 1.80 కి.మీ నిర్మాణానికి రూ.126 లక్షలు.
3, రత్నాపూర్- వెల్దుర్తి జడ్పీ రోడ్డు నుంచి చర్చితండా వరకు 0.96 కి.మీ నిర్మాణానికి రూ.70 లక్షలు.
4, శివ్వంపేట హనుమాన్ నగర్ నుంచి శంకర్తండా వరకు 3.55 కి.మీ నిర్మాణానికి రూ.257 లక్షలు.
5, గూడూరు నుంచి చెన్నపూర్ సామ్యాతండా వరకు 3.30 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.235 లక్షలు.
6, ఆర్ఆండ్బీ రోడ్డు నుంచి పిట్టలవాడ, సికింద్లాపూర్ వరకు 2.20 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.154 లక్షలు.
C. కొల్చారం
1, జడ్పీ రోడ్డు నుంచి జాలాబాయ్తండా వరకు 4.65 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.412 లక్షలు మంజూరు.
2, తుమ్మలపల్లితండా నుంచి పోతిరెడ్డిపల్లి వరకు 1.35 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.108 లక్షలు మంజూరు.
3, జలాల్పూర్(ఎన్) నుంచి ఎన్ఎస్ఎఫ్ రోడ్డు కొల్చా రం వరకు 4 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.402 లక్షలు.
4, పీడబ్ల్యూడీ నుంచి జడ్పీ రోడ్డు వయా వాల్యాతం డా, నాన్యాతండా వరకు 2.45 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.196 లక్షలు మంజూరు.
D. వెల్దుర్తి
1, రామాయంపల్లి జడ్పీ రోడ్డు నుంచి వెల్దురితండా వరకు 2.80 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.196 లక్షలు.
2, పిల్లికొట్యాల్ జడ్పీ రోడ్డు నుంచి శెట్టిపల్లి కలాన్తండా వరకు 2.20 కి.మీ నిర్మాణానికి రూ.190 లక్షలు.
3, కొప్పులపల్లి నుంచి జడ్పీ రోడ్డు (మాసాయిపేట్ మండలం) వరకు 2 కి.మీ నిర్మాణానికి రూ.128 లక్షలు.
E, కౌడిపల్లి
1, లింగంపల్లి జడ్పీ రోడ్డు నుంచి హిత్యాతండా వయా రామ్లాతండా, సోమ్లాతండా వరకు మొత్తం 1.70 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.134 లక్షలు మంజూరు.
2, కంచన్పల్లి నుంచి నాగారంతండా వరకు 2 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.154 లక్షలు మంజూరు.
3, ఎర్రమట్టితండా నుంచి మెదక్ – జోగిపేట పీడబ్ల్యూడీ వరకు 2.80 కి.మీ నిర్మాణానికి రూ.217 లక్షలు.
4, రైలాపూర్ నుంచి తిమ్మాపూర్, కౌడిపల్లి ట్యాంక్బండ్ వరకు 2.20 కి.మీ నిర్మాణానికి రూ.207 లక్షలు.
5, దేవులపల్లి నుంచి కూకట్లపల్లి వయా తుక్యాతండా వరకు 4.60 కి.మీ నిర్మాణానికి రూ.357 లక్షలు.
6, సదాశివపల్లి జడ్పీ రోడ్డు నుంచి వసురాంతండా వరకు 2.20 కి.మీ నిర్మాణానికి రూ. 210 లక్షలు.
F, చిలిపిచెడ్
1, శీలంపల్లి నుంచి అంతారం, నామ్యాతండా, మొండితండా వరకు 2.55 కి.మీ నిర్మాణానికి రూ.204 లక్షలు.
2, రహీంగూడ నుంచి పీడబ్ల్యూడీ వయా ఫైజాబాద్ తండా వరకు 3.90 కి.మీ నిర్మాణానికి రూ.317 లక్షలు.
3, గౌతాపూర్ జడ్పీ రోడ్డు నుంచి భుజరంపేట, ధర్మాతండా వరకు 3.55 కి.మీ నిర్మాణానికి రూ.290 లక్షలు.
4, శీలంపల్లి నుంచి గౌతాపూర్, సోమక్కతండా, బట్టుతండా వరకు 3.30 కి.మీ నిర్మాణానికి రూ.269 లక్షలు.
5, గౌతాపూర్తండా – రాందాస్గూడ – మల్కచెరువుతండా వరకు 3.35 కి.మీ నిర్మాణానికి రూ.276 లక్షలు.
మెరుగైన రవాణా కల్పించడమే లక్ష్యం
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించడమే ప్రభు త్వ లక్ష్యం. గత ప్రభుత్వాల్లో ఎన్నడూ లేని విధంగా తండాల్లో సైతం సీసీ రోడ్లను నిర్మించాం. నర్సాపూర్ నియోజకవర్గంలోని మండలాలకు బీటీ రోడ్ల నిమి త్తం రూ.69.41కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. నర్సాపూర్ నియోజకవర్గంలోని తండాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.138 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపితే, రూ. 69.41కోట్లు మంజూరయ్యాయి. మిగతా నిధులు రావడానికి నా వంతు కృషి చేస్తా. బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తుంది.
– చిలుముల మదన్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే
తండాల్లో మెరుగైన రవాణా
తండాతకు బీటీరోడ్లు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే మదన్రెడ్డికి కృతజ్ఞతలు. మట్టి రోడ్డు ఉండడంతో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు రోడ్డు నిర్మాణం పూర్తయితే ఇబ్బందు లు తీరనున్నాయి. వానకాలం వస్తే బురదలో ప్రయాణించడం నరకంగా ఉండేది. బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయితే తిప్పలు తప్పుతాయి. గిరిజనులు ఎక్కువగా పొలాల వద్ద కే వెళ్తారు. బీటీ రోడ్డు నిర్మాణంతో తండాల్లో రవాణా పరంగా మెరుగైన సౌకర్యం లభిస్తుంది.
– శివాజీ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం (నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు)
రోడ్డు రావాలనే కల నెరవేరింది
తుజాల్పూర్ గ్రామం మీదుగా బీటీ రోడ్డు మంజురు కావడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏండ్లుగా కలగా మిగిలిన రోడ్డు నిర్మాణం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి సహకారంతో తీరింది. బీటీ రోడ్డు మంజూరుతో గిరిజన వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మదన్రెడ్డికి గిరిజనుల తరపున ధన్యవాదాలు.
– గాలి శ్రీరాములు, తుజాల్పూర్ సర్పంచ్