గుమ్మడిదల, నవంబర్ 26: గులాబీ శ్రేణులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మండలంలోని బొంతపల్లి టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు గొల్లవీరయ్యయాదవ్ ఇటీవల నల్లవల్లి రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. స్థానిక టీఆర్ఎస్ నా యకులతో ఈవిషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి శనివారం బొంతపల్లి పంచాయతీ పరిధిలోని వీరభద్రనగర్ కాలనీ నివాసముంటున్న వీరయ్యను పరామర్శించారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా వెన్నం టి ఉంటానని తెలిపారు. ఎంపీపీ సద్దిప్రవీణ, జడ్పీటీసీ కుమార్గౌడ్, సర్పంచ్ ఆలేటి నవీనాశ్రీనివాస్రెడ్డి, సీనియర్ నాయకులు గోవర్ధన్రెడ్డి, నరేందర్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, గ్రామకమిటీ అధ్యక్షుడు గోపాల్ ఉన్నారు.
దోమడుగులో అయ్యప్పస్వామి సన్నిధానం
దోమడుగు పోచమ్మ ఆలయ ప్రాంగణంలో గ్రామానికి చెందిన అయ్యప్పస్వామి భక్తుల కోసం అయ్యప్పస్వామి సన్నిధానాన్ని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సహకారంతో జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ రూ.15 లక్షల నిధులతో సన్నిధానాన్ని నిర్మించారు. దీనిని ఎమ్మెల్యే పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. సన్నిధానంలో నిర్వహించిన పడిపూజలో పాల్గొన్నారు. సర్పంచ్ రాజశేఖర్, అయ్యప్పస్వామి భక్తులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. వీరితో పాటు పలువురు మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పేదలకు వరంగా సీఎంఆర్ఎఫ్
నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ వరంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని పాతబస్తీకి చెందిన రాములు భార్య లక్ష్మి వైద్య చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. రెండున్నర లక్షల ఎల్వోసీ పత్రాలను టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు, మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే లభ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, రాష్ట్ర కార్మిక నాయకుడు వరప్రసాద్రెడ్డి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, వెంకటయ్య, లబ్ధిదారులు పాల్గొన్నారు.
కార్యకర్త కుటుంబానికి విక్రంరెడ్డి సాయం
టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే తనయుడు సాయమందించి అండగా నిలిచారు. నల్లవల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త బనకదాసు దంపతుల 11 నెలల పాప కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నది. ఈవిషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తనయుడు గూడెం విక్రమ్రెడ్డి కార్యకర్త ఇంటికి వెళ్లి ఆ పాప ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం తక్షణమే రూ.20 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు.ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీనికి బాధితకుటుంబ సభ్యులు ఎమ్మెల్యే తనయుడికి ధన్యవాదాలు తెలిపారు. వీరితో పాటు జడ్పీటీసీ కుమార్గౌడ్, ఎంపీటీసీ కొత్తపల్లి ప్రభాకర్రెడ్డి, మండల అధ్యక్షుడు మహ్మద్హుస్సేన్, యువజన నాయకుడు శేఖర్రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షుడు ఫయాజ్షరీఫ్ ఉన్నారు.