వెల్దుర్తి, నవంబర్ 26 : సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి ఫలాలు పల్లెపల్లెకూ అం దుతున్నాయని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని శంశిరెడ్డిపల్లి, చర్లపల్లి గ్రామాల్లో శనివారం పర్యటిం చా రు. శంశిరెడ్డిపల్లి రూ. 25లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, అరెగూడెంలో రూ. 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, దామరంచలో రూ. 9లక్షలతో నిర్మించిన యాదవ భవనం, ధర్మారంలో రూ. 20లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, అందుగులపల్లిలో రూ.15లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, మహ్మద్నగర్తండాలో రూ. 12.5 లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, మానేపల్లిలో రూ. 27లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, అందుగులపల్లి శివారులో రూ. 1.42 కోట్లతో నిర్మించిన సబ్స్టేషన్ను ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలోని గ్రామాలు అభివృద్ధ్ది బాటలో నడుస్తున్నాయని, మౌలిక వసతుల కల్పనతో ఆదర్శంగా మారుతున్నట్లు పేర్కొన్నారు. పల్లెప్రగతితో గ్రా మాల రూపురేఖలు మారాయని, సంపూర్ణ పారిశుధ్య పను లు, శిథిల నిర్మాణాలను తొలిగించడంతో కొత్తగా మారాయన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు జరిగాయన్నారు. వైకుంఠ ధామాల నిర్మాణాలతో ప్రజలు ఇబ్బందులు తీరాయ న్నారు. వెల్దుర్తి మండలంలోని 35 మంది, మాసాయిపేట మండలంలోని నలుగురు లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు.
స్వరాష్ట్రంలో విద్యుత్ వెలుగులు…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ సమస్యలు లేకుండా సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయ రంగానికి పూర్తిగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రతి మం డలంలో విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ జానకిరాములు, డీఈ రాజేందర్, ఏడీ రాజమల్లు, ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్గౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షు డు వేణుగోపాల్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి, సర్పంచ్లు శాంతి, శేఖర్, భాస్కర్రెడ్డి, శంకర్రెడ్డి, వెంకటలక్ష్మి, వినోద, సుజాత, శంకర్, మధుసూదన్రెడ్డి, ఎంపీటీసీలు మోహన్రెడ్డి, బాస్కర్గౌడ్, ఎంపీడీవో జగదీశ్వరాచారి, ఆర్ఐ సందీప్, టీఆర్ఎస్ నాయకులు నరేందర్రెడ్డి, ఆంజనేయులు, మహేందర్రెడ్డి, శివరాములు, వడ్ల నర్సిం హులు, సత్యంగౌడ్, పాపాగౌడ్, శ్రీనివాస్రెడ్డి, రాజులు, స్వామి, లక్ష్మణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.