మెదక్/సంగారెడ్డి, నవంబరు 26 : భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిదని, ప్రతి ఒకరూ చదివి హకులు, బాధ్యతలు తెలుసుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ బీ.ఆర్. అంబేదర్ చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. అంబేదర్ నేతృత్వంలో ఆరుగు రు సభ్యులు ఎంతో శ్రమించి 2 సంవత్సరాల 11నెలల 18 రోజుల్లో అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించారన్నారు. దేశంలో ఉన్న విభిన్న జాతులు, మతాలు, జీవన విధానం, జీవనశైలిని దృష్టిలో పెట్టుకొని అందరికీ సమన్యాయం చేయాలని ఉద్దేశం తో రాజ్యాంగాన్ని రచించారన్నారు. ప్రతి ఒకరూ రాజ్యాంగాన్ని చదివి ఆకళింపు చేసుకోవాలని కోరారు. బీ.ఆర్. అంబేద్కర్ జాతీయ రాజ్యాంగాన్ని తయారు చేశారని సంగా రెడ్డి జి ల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్, ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ అన్నారు. శనివారం జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు సిబ్బంది, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, ప్యా నెల్ లాయర్లు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. దేశానికి రాజ్యాంగం ఏర్పాటు కోసం 13కమిటీలను వేసి నిపుణులను సభ్యులుగా చేర్చి రాజ్యాంగాన్ని రూపొందించారని ఎస్పీ రమ ణ కుమార్ గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.