ఆయిల్పామ్ పంట నూనె దిగుబడి 4 నుంచి 5 రెట్లు అధికంగా ఉంటుంది. మొక్కలు నాటిన తర్వాత నాలుగో సంవత్సరం నుంచి కాపు మొదలై 30 ఏండ్ల వరకు నిరంతర దిగుబడితో ఆదాయం వస్తుంది. తెగుళ్లు, చీడపీడలు ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్లో చాలా తక్కువ. ఈ పంట ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. కోతులు, అడవి పందుల బెడద ఉండదు. ఆయిల్పామ్ సాగులో ఖర్చు, కూలీల అవసరం చాలా తక్కువ ఉంటుంది. ఒక రైతు సుమారు 10 ఎకరాల ఆయిల్ పామ్ తోట పర్యవేక్షణ చేయవచ్చు. ఇతర పంటల మాదిరిగా ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పార పట్టడం, తేమ శాతం లాంటి సమస్యలు ఆయిల్పామ్లో లేవు, దళారీ వ్యవస్థ అసలే ఉండదు. రైతు గెలలు కోసిన తర్వాత నేరుగా ఫ్యాక్టరీకి తరలించి మూడు రోజుల్లో గెలల డబ్బు లు, రవాణా చార్జీలు పొందే అవకాశం ఉంటుంది.
ఆయిల్ పామ్ సాగు వల్ల నిరంతర దిగుబడి, ఆదాయంతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు.ఇతర పంటలతో పోలిస్తే ఖర్చులుపోను అయిల్పామ్ సాగు వల్ల ఏడాదికి ఎకరాకు నికరంగా రూ.లక్ష ఆదాయం మిగులుతుంది. మొద టి మూడేండ్లు ఆదాయం కోసం అంతర పంటలుగా కూరగాయలు, మొక్కజొన్న, పత్తి, బొబ్బె ర్లు, పెసళ్లు, కందులు, ఉలువలు, పొద్దుతిరుగు డు, అరటి, బొప్పాయి, వేరుశనగ లాంటి పంట లు సాగు చేసుకోవచ్చు. ఐదు సంవత్సరాల తర్వా త కూడా అంతర పంటలుగా కోకో, పొట్టి మిరియాలు మొదలగు సాగుచేసి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది.
జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై గ్రామాల్లో ఉద్యానవన, వ్యవసాయశాఖలు సంయుక్తంగా అవగాహన కల్పిస్తున్నాయి. ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన వాతావరణం, మంచి భూములు ఉండడంతో పాటు పుష్కలమైన సాగు నీరు ఉంది. దీనికి తోడు సీఎం కేసీఆర్ రైతులకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నారు. ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారు. దీంతో రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. ఆయిల్ పామ్ మొక్కలు నాటడానికి ప్రస్తుత సమయం అనుకూలం కావడంతో రైతుల చేత మొక్కలు నాటించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్ధం చేసింది.
జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద ఆయిల్ పామ్ నర్సరీ, జగదేవ్పూర్ మండలం ఎల్లాయిగూడ నర్సరీ, ములుగులో నర్సరీలు ఏర్పాటు చేశారు. వీటన్నింటిలో కలిపి సుమారు
11 వేల ఎకరాలకు సరిపడా మొక్కలు సిద్ధం చేశారు. రైతుల అవసరాల మేరకు మొక్కలు అందించడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నది. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు ఆరు వేలకు పైగా మొక్కలు నాటారు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మొక్కలు నాటేందుకు అనుకూలమైన వాతావరణం ఉంది. రైతులు మొక్కలు నాటాలని గ్రామాల్లో వ్యవసాయ, ఉద్యానశాఖలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి.
ఒక ఎకరంలో 57 మొక్కలు నాటనున్నారు. ఇతర పంటలతో పోల్చితే ఆయిల్ పామ్ సాగు వల్ల దిగుబడి,లాభాలు ఉంటాయని అధికారులు వివరిస్తున్నారు. జిల్లాలోనే నంగునూరు మండలం నర్మెటలో రూ. 300 కోట్లతో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణమవుతున్న విషయం తెలిసిందే. గ్రామాల్లో అయిల్ పామ్ సాగు చేసే రైతుల వివరాలను నమోదు చేసుకొని వారికి కావాల్సిన బిందు సేద్యానికి సంబంధించిన పరికరాలు వెంటనే అందించి బిగిస్తున్నారు.
జిల్లాలో సుమారు ఆరు వేల ఎకరాల్లో ఈ రెండు సంవత్సరాల్లో సాగైంది. అత్యధికంగా నంగునూరు మండంలో 296 మంది రైతులు 1,100 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. సిద్దిపేట రూరల్ మండలంలో 79 మంది 242 ఎకరాలు, నారాయణరావుపేట మండలంలో 104 మంది 256 ఎకరాలు, సిద్దిపేట అర్బన్ మండలంలో 43 మంది 150ఎకరాలు, చిన్నకోడూరులో 81 మంది 332 ఎకరాలు మొత్తం సిద్దిపేట నియోజకవర్గంలో 603 మంది 2079 ఎకరాల్లో అయిల్పామ్ సాగు చేశారు. కోహేడలో 113 మంది 423 ఎకరాలు, హుస్నాబాద్లో 21మంది 61 ఎకరాలు, అక్కన్నపేటలో 18 మంది 59 ఎకరాలు మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గంలో 152 మంది 543 ఎకరాల్లో సాగు చేశారు. బెజ్జంకి మండలంలో 31మంది 177 ఎకరాలు.
దుబ్బాక మండలంలో 72 మంది 259 ఎకరాలు, మిరుదొడ్డిలో 89 మంది 311 ఎకరాలు,దౌల్తాబాద్లో 16 మంది 52 ఎకరాలు, తొగుటలో 56మంది 203 ఎకరాలు, రాయపోల్లో 16 మంది 48 ఎకరాలు మొ త్తంగా దుబ్బాక నియోజకవర్గంలో 249 మంది 873 ఎకరాల్లో సాగు చేశారు. కొండపాకలో 51 మంది 229 ఎకరాలు, గజ్వేల్లో 27 మంది 92 ఎకరాలు, జగదేవ్పూర్లో 64 మంది 269 ఎకరాలు, ములుగులో 16మ ంది 77 ఎకరాలు, వర్గల్లో 16 మంది 85 ఎకరాలు, మర్కూక్లో 63 మంది 227 ఎకరాలు మొత్తం గజ్వేల్ నియోజకవర్గంలో 237 మంది రైతులు 979 ఎకరాల్లో సాగు చేశారు. చేర్యాలలో 52 మంది 246 ఎకరాలు, కొమురవెల్లిలో 31 మంది 164 ఎకరాలు, దూళిమిట్టలో 23 మంది 113 ఎకరాలు, మద్దూరు మండలంలో67 మంది 231 ఎకరాలు, మొత్తం గా జనగామ నియోజకవర్గంలో 173 మంది రైతులు 754 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. మరో వారం రోజుల్లో నాలుగైదు వందల ఎకరాల్లో మొక్కలు నాటేందుకు రైతులు సిద్ధమయ్యారు.
జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. మంత్రి హరీశ్రావు సహకారంతో గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో ఆరు వేల ఎకరాల్లో సాగు చేశారు. నాలుగు నర్సరీలు ఏర్పాటు చేశాం. రైతుల అవసరాల మేరకు మొక్కలను సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం మొక్కలు నాటడానికి అనుకూలమైన సమయం.
– రామలక్ష్మి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి
ఆయిల్పామ్ పంట సాగు చేస్తే రైతులు దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చు. పంట సాగుచేసిన నాలుగు సంవత్సరాల నుంచి 30 ఏండ్ల వరకు ప్రతినెలా దిగుబడితో పాటు నిరంతర ఆదాయం లభిస్తుంది. రైతులు ఆర్థికంగా గొప్ప పురోగతి సాధిస్తారు. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో జిల్లాలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు చేయడానికి క్షేత్ర స్థాయిలో రైతులను ఉద్యానశాఖ, వ్యవసాయశాఖల అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
– ఎడ్ల సోమిరెడ్డి, రాష్ట్ర ఆయిల్పామ్ రైతు వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు
జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. మంత్రి హరీశ్రావు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. ఆయిల్ పామ్ సాగు చేస్తే ప్రతి సంవత్సరం ఖర్చులు పోను ఎకరానికి నికర లాభం లక్ష వరకు ఉంటుంది. ఈసాగు రైతులకు సెక్యూరిటీ కలిగిన తోట పంట అని చెప్పవచ్చు. మంచి లాభదాయకమైన పంట. ఆయిల్పామ్ గెలలను ఆయిల్ ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ప్రతినెలా గెలల ధర నిర్ణయంతో పూర్తి పారదర్శకంగా మార్కెటింగ్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి కన్నా ఎక్కువ ఆదాయం ప్రతినెలా రైతు పొందుతాడు.
– పి.ప్రవీణ్రెడ్డి, జల్లా ఆయిల్ ఫెడ్ కోఆర్డినేటర్
సీఎం కేసీఆర్ జిల్లాలో పెద్దఎత్తున రిజర్వాయర్లు నిర్మించారు. మంత్రి హరీశ్రావు సహకారంతో జిల్లాలో ఆయిల్ పామ్ సాగుచేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. అవసరమైన బిందు సేద్యం, మొక్కలను రైతులకు అందిస్తున్నారు. జిల్లాలోని నేలలు ఆయిల్పామ్ సాగుకు అనుకూలం. గ్రామాల్లో రైతు బంధు సభ్యులు రైతులకు అవగాహన కల్పిం చి ఆయిల్ పామ్ సాగు చేసేలా ప్రోత్సహించాలి.
– వంగ నాగిరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు
తక్కువ శ్రమ, పెట్టుబడితో ఆయిమ్పామ్ పంట సాగు చేయడం వల్ల అధిక ఆదాయం సమకూరనున్నది. మాకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో వరి, మొక్కజొన్న వేస్తే కూలీల కొరత, పెట్టుబడి ఖర్చులు ఎక్కువ అయ్యేది. మంత్రి హరీశ్రావు, ఉద్యానశాఖ అధికారుల సూచనతో 10 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నా. నాలుగు సంవత్సరాల వరకు ప్రభుత్వమే పెట్టుబడి సాయం గా ఎకరాకు రూ.4200 అందిస్తున్నది. దీనికి తోడు అంతరపంటల సాగుతో ఖర్చులు మిగులుతున్నాయి.
– ఉపేందర్రెడ్డి, రైతు, దౌలాపూర్ (గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్)
ఆయిల్పామ్తో అధికలాభాలు పొందవచ్చు. మొత్తం ఆరు ఎకరాల భూమి ఉంటే మూడు ఎకరాల్లో ఆయిల్పామ్ పంట సాగు చేశా.అంతర పంటలుగా వంకాయ, బెండకాయ సాగుచేసి లాభాలు పొందుతున్నా. తక్కువ నీరు ఉన్నప్పటికీ డ్రిపు సౌకర్యం ద్వారా మొక్కలను నీరు అందిస్తున్నా. ప్రభు త్వం కూడా రైతులను ప్రోత్సహించడం అభినందనీయం.
– చాట్లపల్లి నవీన్, వెంకట్రావ్పేట, తొగుట మండలం
ఆయిల్పామ్ సాగు వల్ల ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయాధికారులు చెప్పారు. ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ కింద డ్రిప్ పరికరాలు అందజేసింది. ఎకరాకు 57 ఆయిల్పామ్ మొక్కలు నాటమన్నారు. ఒక్కోమొక్కకు రూ.173 ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఇందులో రైతు వాటా కింద రూ.20 మాత్రమే చెల్లించాలి. 12 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుచేశా. ఏడాది పొడవునా మెయింటెనెన్స్ కింద ఎకరాకు ప్రభుత్వం రూ. 4200 చెల్తిస్తున్నది. పంటచేతికి వచ్చిన తర్వాత మార్కెట్ రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రస్తుతానికైతే అన్ని మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి.
– అభిమన్యుకుమార్, రైతు, గౌరారం
ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సహించడం అభినందనీయం. మర్కూక్లో 15 ఎకరాల భూమి ఉంది. సీఎం కేసీఆర్ ఆయిల్పామ్సాగును ప్రోత్సహిస్తుండడంతో మండల వ్యవసాయాధికారులు పంట గురించి చెప్పారు. నాలుగున్నర ఎకరాల్లో ఆయిల్పామ్సాగు చేపట్టా. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన డ్రిప్తో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. అంతరపంటగా టమాటా, బుడిమకాయ, బబ్బెర పంటలు వేస్తే మంచి లాభాలు వచ్చాయి. సంవత్సరానికి ప్రభుత్వం ఎకరానికి రూ. 4200 వేలు మెయింటెనెన్స్ ఇవ్వడంతో పెట్టుబడి తక్కువైంది.
– జీవన్రెడ్డి, రైతు, మర్కూక్
మాకు సుమారు 13 ఎకరాల భూమి ఉంది. నాలుగు ఎకరాల్లో గత ఏడాది నుంచి ఆయిల్పామ్ సాగు చేస్తున్నా. అంతరపంటగా మొక్కజొన్న సాగు చేపట్టా. అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మరో 30 గుంటల్లో అంతర పంట మిర్చి సాగుచేశా. ఎలాంటి ఇబ్బంది లేకుండా లాభాలు వచ్చాయి. ఆయిల్పామ్ మొక్కలు నాటి ఏడాది పూర్తవుతుంది. ఇంకా మూడేండ్లు అయితే పంట చేతికి వస్తుందని అధికారులు చెప్పారు.
-సాయి కృష్ణ, యువరైతు, చంద్లాపూర్
ఆయిల్ పామ్ పంట సాగు వల్ల అధిక లాభాలు వస్తాయి.ప్రభుత్వం అయిల్ పామ్ సాగు చేయాలని రైతులను ప్రోత్సహించడం సంతోషంగా ఉన్నది. మూడు ఎకరాల్లో అయిల్పామ్ పంట సాగు చేశా. ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు ద్వారా రెండు పంటలు సాగు చేస్తున్నా. అటు ఆయిల్ పామ్ మొక్కలు కాపాడుకుంటూ ఇటు అంతర పంటల సాగువైపు దృష్టిసారించా. రైతులు కూడా ముందుకు వచ్చి ఆయిల్పామ్ పంట సాగుచేయాలి.అంతర పంటలు సాగు చేసి అధిక ఆదాయం పొందే అవకాశం ఉన్నది.
– తిరుపతిరెడ్డి, మంతూర్ గ్రామం, రాయపోల్ మండలం