మెదక్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): పోడు భూముల సమస్యల పరిషారంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యల పరిషారానికి అధికార యంత్రాంగం శాంతియుతంగా, కలిసికట్టుగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ సూచించారు. సోమవారం పొడుభూములపై కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో సమావేశంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహించినప్పుడు ప్రజల నుంచి సమస్యలతో పాటు, వాగ్వాదాలు వచ్చే అవకాశాలున్నాయని, వాటిని సానుకూలంగా స్పందించి ఎలాంటి గొడవలు జరగకుండా పరిషరించాలని రెవెన్యూ, అటవీ సంబంధితశాఖ అధికారులకు సూచించారు. గొడవలు జరిగే ఆసారం ఉన్నప్పుడు స్థానిక పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు. సమావేశంలో మెదక్ ఎస్పీ రోహిణీప్రియదర్శిని, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఎఫ్వో రవిప్రసాద్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి బి.కేశురాం, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్, ఆర్డీవో సాయిరాం, డీఎస్పీ సైదులు, అటవీశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.