గుమ్మడిదల,నవంబర్21: వీరభద్రస్వామి మమ్మే లు అంటూ భక్త జనసందోహం కార్తిక చివరి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం మండలంలోని వీరన్నగూడెం బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయం ఆధ్యాత్మికతతో పులకరించిపోయింది. భక్తులు భారీగా తరలివచ్చా రు. దేవాలయంలో కార్తిక దీపాలు వెలిగించి వీరభద్రస్వామిని మొక్కులు సమర్పించుకున్నారు. తులసికోట, నందీశ్వరుడి వద్ద కార్తిక దీపాలు వెలిగించారు.
ఆలయ ప్రాంగణంలో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు, రుద్రాభిషేకాలు, వీరభద్రస్వామి ప్రస్తాయాలను నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మోహన్ స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు గటాటి భద్రప్ప, ఆలేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీటీసీ పొన్నబోయిన వేణు, ఆలయ పర్యవేక్షకుడు సోమయ్య డీపీవోను సత్కరించారు. అనంతరం అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ధర్మకర్తలు లక్ష్మీనారాయణ, బొంతపల్లి ఈవో శ్రీనివాస్రెడ్డి, వినోద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్రూరల్, నవంబర్ 21: కార్తిక మాసం చివరి సోమవారాన్ని పుస్కరించుకుని మెదక్ మండలంలోని మంబోజిపల్లి మల్లన్న ఆలయం, మాచవరం శివాలయం గరుడ గంగా సరస్వతీ ఆలయా ల్లో తెల్లవారు జాము నుంచే శినామస్మరణతో మార్మోగాయి. శైవ కేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. మంబోజిపల్లి శివారులోని కొయ్యగుట్టపై కొలువుదీరిన మల్లికార్జున స్వామి ఆలయంలో లింగానికి పూజారి మల్లన్న ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం నిర్వహించారు. మహిళలు ఉసరి చెట్టు వద్ద పూజలు చేసి దీపాలు వెలిగించారు. 11వేల బిల్వా పత్రాలతో ప్రత్యేక పూజాలు చేశారు. శబరిమాత ఆశ్రమంలో సత్యనారాయణ వత్రాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.