సిర్గాపూర్, నవంబర్ 21: ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న గిరిజన బాలికల గురుకుల పాఠశాల సొంత భవనం కల ఎట్టకేలకు నెరవేరబోతున్నది. ఆరేండ్ల నుం చి అద్దె భవనంలో అష్టకష్టాలు పడుతున్న బాలికల వసతులు ఇప్పుడు తీరనున్నాయి. ప్రస్తుతం కల్హేర్ మండ లం బాచెపల్లి శివారులోని ఓ ప్రైవేటు భవనంలో గురుకులం కొనసాగుతున్నది. మారుమూల ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల విద్యాభ్యాసం మెరుగుపరచానే లక్ష్యం తో టీఆర్ఎస్ సర్కార్ అందుబాటులో బాలికలు, బాలురకు ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేసింది. ప్రస్తుతం పాఠశాల అప్ గ్రేడ్ కాగా కళాశాల తరగతులు సైతం కొనసాగుతున్నాయి.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో అత్యధికంగా గిరిజన తండాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యం లో స్థానిక ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజవర్గానికి మొత్తం 8 రెసిడెన్షియల్స్ మంజూరు చేయించారు. 4 ఎస్టీ, రెండు మైనార్టీలు, రెండు బీసీ గురుకులాలు ఉన్నాయి. వీటిలో సగం బాలికల రెసిడెన్షియల్స్ ఉన్నాయి. వీటిలో అన్నింటికి సొంత భవనాల నిర్మాణం పూర్తయ్యాయి. సిర్గాపూర్ మండ ల కేంద్రంలో అందుబాటులో ప్రత్యేక స్థలం కేటాయింపులో కొంత ఆలస్యమైంది. దీనికి తోడు కంట్రాక్టర్ పనుల్లో కూడా జాప్యమయ్యాయి.
స్థానిక శివారులోని 169/2 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలో మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవన సముదాయం నిర్మించ తలపెట్టారు. ఈ నేపథ్యంలో 2016 డిసెంబర్ 9న మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇక్కడి ప్రభుత్వ భూమి కొందరి కబంధ హస్తాల్లో ఉండడంతో దుర్వినియోగం అవుతుందనే విషయాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించి సర్వే చేసి తమ సరిహద్దుల గుర్తించి కడ్డీలు పాతారు. కొందరు తమ పట్టా భూమిలోనే సర్వే చేశారని, ఏళ్ల తరబడి తమ కబ్జాలో ఉందని తెలిపారు. దీం తో కొంతకాలం స్థల వివాదం సమస్యాత్మకంగా మారిం ది. ఎమ్మెల్యే దీంట్లో జోక్యం చేసుకుని స్థానికుల తో సమావేశమై చర్చించి ఇక్కడి ప్రభుత్వ భూమి మొ త్తాన్ని సర్వే చేపట్టి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు.
2017 అక్టోబర్లో నిర్మాణ పనులు ప్రారంభించారు. కంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పునాది స్థాయిలో దాదాపు రెండేండ్ల పాటు పనులు నిలిచిపోయాయి. దీంతో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి జోక్యం చేసుకుని, సదరు గుత్తేదారుతో పనులు చేయించారు. ప్రస్తుతం మూడు అంతస్తులతో నిర్మాణం పూర్తి చేసుకున్న భవన సముదాయం ప్రారంభానికి ముస్తాబైంది. ఈ భవనాన్ని మొత్తం రూ.4.20 కోట్లతో నిర్మించారు. ఇందులో మొత్తం 32 గదులున్నాయి. ఇందులో తరగతి గదు లు- 32, లేబరేటరీ గదులు-4, వెల్నెస్-1 గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ హాల్, కిచెన్, స్టాఫ్రూమ్, ప్రిన్సిపాల్ రూమ్, స్టోర్ గది, భవనంలో మొత్తం 28 టాయిలెట్స్, స్నానపు గదులు ఉన్నాయి. గ్రౌండ్ఫ్లోర్లో ప్రత్యేక స్నానపు గదుల కోసం షెడ్డు ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో 30 నల్లాలు బిగించారు. అన్ని సౌకర్యాలు, వసతులతో అన్ని హంగులతో ముస్తాబు చేశారు.
సిర్గాపూర్లో నిర్మించిన ఎస్టీ గురుకులంలో కొనసాగుతున్న పనులను ట్రైబల్ వెల్ఫేర్ సబ్ డివిజన్ హైదరాబాద్ డిప్యూటీ ఈఈ సత్యానంద్, జడ్పీటీసీ మల్లగారి రాఘవరెడ్డి సోమవారం పరిశీలించారు. రేపు మంత్రి హరీశ్రావుతో ఈ భవనం ప్రారంభించనున్న ట్లు, మిగిలిన పనులు పూర్తి చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రహరీ నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్నాయి. వారితో ఏఈ నిత్యానంద్, సిబ్బంది ఉన్నారు.