మల్లికార్జునస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ దంపతులు
భారీగా వెలిసిన దుకాణ సముదాయాలు
భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పాలక మండలి
అమీన్పూర్, మార్చి 1 : బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జునస్వామి బ్రహోత్సవాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూ పాల్రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ పాలక మండలి చైర్మన్ తులసిరెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహా శివరాత్రి సందర్భంగా బీరంగూడ మల్లికార్జునస్వామి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. స్వామివారి బ్రహోత్సవాలను వీక్షించడానికి భక్తులు ముందురోజు ఆలయానికి వచ్చి నిద్ర చేస్తుంటారు. ఈ సందర్భంగా స్వామివారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు.
భారీగా వెలిసిన దుకాణాలు..
జాతరలో భక్తులకు కావాల్సిన అన్ని రకాల పూజ సామ గ్రి, స్వీట్లు తదితర వస్తువులు అందుబాటులో ఉండేలా దుకాణాలు వెలిశాయి. పిల్లలు జాతరలో సంతోషంగా గడిపేందుకు రంగుల రట్నాలు, ఆట వస్తువులు దుకాణాల్లో దొరుకుతాయి.
జాతరకు భారీ బందోబస్తు..
బ్రహోత్సవాల్లో భాగంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లను డీఎస్పీ స్వయంగా పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. భక్తుల కోసం తాగునీటి సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శశిధర్, ఎంపీపీ దేవానంద్, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్, పటాన్చెరు కాంగ్రెస్ ఇన్చార్జి కాట శ్రీనివాస్గౌడ్ దంపతులు, కార్పొరేటర్లు సిందూఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్ యాదవ్, మెట్టు కుమార్, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
సాయిబాబా ఆలయంలో పూజలు…
మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా గోశాలలోని సా యిబాబా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్సీ బీటీ నాయుడు పాల్గొని పూజలు చేశారు. మల్లికార్జునస్వామి దేవాలయం, సాయి ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు.