సంగారెడ్డి, నవంబర్ 20: సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా పంచాయతీకి రూ.20 లక్షలతో నిర్మాణ పనులను ప్రారంభించామని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషర్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి మండల పరిధిలోని 11 పంచాయతీల్లో 10 పంచాయతీలు చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనాల పనులను గ్రామాల సర్పంచ్లతో కలిసి చింతా ప్రభాకర్ ప్రారంభించారు. పనులు ప్రారంభించేందుకు విచ్చేసిన చింతా ప్రభాకర్కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా కొత్లాపూర్లో ప్రారంభించిన పనులను ఫసల్వాది గ్రామంలో ముగించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గతంలో గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు అభివృద్ధి నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారన్నారు. అందుకు సంబంధించిన నిధులతో పంచాయతీల్లో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో వరద ప్రవాహంలో కోతకు గురైన రోడ్లకు బీటీ రెన్యువల్ చేసేందుకు జిల్లాలో 67 రోడ్లను అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికను మంజూరు కోసం పంపించారన్నారు. అందులో 39 రోడ్లకు టెండరు ప్రక్రియ పూర్తి చేసుకుని మిగతావి టెండరు ప్రక్రియ పురోగతిలో ఉన్నాయన్నారు.
23 కల్వర్టులకు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులకు నిధులు ఇచ్చిందన్నారు. ఉద్యమాలతో సాధించిన స్వరాష్ట్రంలో పేదింటి ఆడపిల్లలకు ప్రభుత్వ వాయినంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో రూ.1,00,016 ఆర్థిక సాయం అందజేస్తున్నదన్నారు. కానీ, రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలను జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం విడ్డూరమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సంగారెడ్డి జడ్పీటీసీ సునీత, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ముస్తఫా, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాంగోపాల్, సర్పంచ్లు నిర్మలాదేవి, మోహన్సింగ్ నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు చక్రపాణి, మధుసూదన్రెడ్డి, నాయకులు మనోహర్గౌడ్, ప్రేమానందం, రఘు, సాయన్న, అంజాగౌడ్, కృష్ణ, ప్రభాకర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.