సంగారెడ్డి, నవంబరు 16: తెలంగాణలో మహిళా భద్రతకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి నేరాలు అదుపు చేస్తున్నదని, వారి భద్రతకు ఉమెన్ సేప్టీవింగ్తో పాటు పోలీసులు భద్రత కల్పిస్తున్నామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్ జిల్లాలతో పాటు వికారాబాద్ జిల్లాకు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్స్, రిసెప్షన్ ఆఫీసర్స్ రెండో రోజు శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ కోటిరెడ్డి హజరై జ్యోతి ప్రజ్వలన చేసి, శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రతకు ఉమెన్ సేఫ్టీవింగ్ను ఏర్పాటు చేసి భరోసా కల్పిస్తున్నామన్నారు.
మహిళలను వేధింపులకు గురిచేస్తే వారిపై ఉమెన్ సేఫ్టీవింగ్ హెల్ప్డెస్క్ 181, లేదా చైల్డ్లైన్ నంబర్1098, డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. వీటితో పాటు ఆపదలో ఉన్న మహిళలు వెంటనే డయల్-100, 108, 1098, 181లకు, సైబర్ క్రైమ్ జరిగితే 1930 హెల్ప్లైన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, చర్యలు తీసుకుంటున్నదన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యను ఓపికగా విని సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు.
ఈ ఉమెన్ సేఫ్టీవింగ్ను డీజీపీ మహేందర్రెడ్డి, అదనపు డీజీపీ స్వాతి లక్రా, డీఐజీ బడుగుల సుమతి నేతృత్వంలో ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీవింగ్ అదనపు ఎస్పీ రాజారత్నం, ఇన్స్పెక్టర్ నరేశ్బాబు, డీఎస్పీ రవీంద్రారెడ్డి, సిబ్బంది, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలకు చెందిన స్టేషన్ హౌస్ అధికారులు, రిసెప్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.