కొల్చారం, నవంబర్ 16 : ఆర్టీసీ సంస్థ ప్రయా ణికులకు వివిధ రకాల ప్రయాణ రాయితీలు కల్పిస్తుందని మెదక్ రీజినల్ మేనేజర్ సుదర్శన్ తెలిపా రు. మండల పరిధిలోని రంగంపేటలో బుధవారం సర్పంచ్ బండి సుజాతారమేశ్ అధ్యక్షతన ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా రీజినల్ మేనేజర్ సుదర్శన్ మాట్లాడుతూ.. టీఎస్ ఆర్టీసీ లాభనష్టాలతో సంబంధం లేకుండా ఎన్నో రకాల రాయితీలు కల్పిస్తూ ప్రయాణికులకు సేవ చేస్తుందని, ప్రజల ఆదరణతోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సురక్షిత ప్రయాణానికి చిహ్నమైన ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలన్నారు.
తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు టికెట్ తోపాటు ప్రత్యేక దర్శనం టోకెన్లు ఇస్తున్నట్లు తెలిపారు. రంగంపేటలో కంట్రోలర్ను ఏర్పాటు చేయాలని, జోగిపేట – మెదక్ సర్వీసులు నడిపించాలని, రాత్రి 9గంటలకు మెదక్ నుంచి సంగారెడ్డి వైపు చివరి బస్సు వేయాలని సర్పంచ్ సుజాత కోరారు. త్వరలోనే సమస్యను పరిష్క రించాలని మెదక్ డీఎం రవిచంద్రను ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మణ్, కండక్టర్ సంగమేశ్వర్, ఎంపీటీసీ మాధవీరాజాగౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.