జహీరాబాద్ మండలం రంజోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మల్టీ జోన్-2 రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ సంబురంగా ప్రారంభమైనది. బుధవారం గురుకుల పాఠశాల ఓఎస్డీ చంద్రకాంత్రెడ్డి, అడిషనల్ ఆర్థిక కార్యదర్శి పార్వతీదేవితో కలిసి ఎమ్మెల్యే మాణిక్రావు స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. మార్చ్ ఫాస్ట్ నిర్వహించి గౌరవ వందనం చేశారు. సభా వేదిక వద్ద క్రీడా జ్యోతిని వెలిగించారు. రాష్ట్రంలోని మల్టీ జోన్ -2 పరిధిలోని జనగాం, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన విద్యార్థినులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ ఒలింపిక్స్లో పతకాలు సాధించాలనే లక్ష్యంతో బాలికలు ముందుకు వెళ్లాలని సూచించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు.
జహీరాబాద్, నవంబర్ 9: జహీరాబాద్ మండలం రంజోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ మల్టీ జోన్-2 స్పోర్ట్స్ మీట్ను గురుకుల పాఠశాల ఓఎస్డీ చంద్రకాంత్రెడ్డి, అడిషనల్ కార్యదర్శి ఆర్థిక పార్వతిదేవితో కలిసి ఎమ్మెల్యే మాణిక్రావు ప్రారంభించారు. బాలికల స్పోర్ట్స్ మీట్లో భాగంగా మార్చ్ ఫాస్ట్ నిర్వహించి, ఎమ్మెల్యే మాణిక్రావు గౌరవ వందనం చేశారు. జాతీయ జెండాలతో బాలికలు బ్యాండ్ మోగిస్తూ మార్చ్ఫాస్ట్ చేశారు. సభా వేదిక వద్ద ఎమ్మెల్యే మాణిక్రావు క్రీడా జ్యోతిని వెలిగించారు.
క్రీడా జ్యోతితో బాలికలు మైదానంలో పరుగులు తీశారు. ఒలింపిక్ స్థాయిలో రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని మల్టీ జోన్ -2 పరిధిలోని జనగాం, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెంది విద్యార్థినులు స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు. బాలికలు, ఎమ్మెల్యే మాణిక్రావు, అధికారులు గాలిలోకి బెలూన్లు వదిలారు. సభా వేదిక ముందు బాలికలు పలు సాంస్కృతిక కార్యక్రమలు నిర్వహించారు.
వ్యాయామ ఉపాధ్యాయులు, బాలికలు మైదానంలో ఎమ్మెల్యే మాణిక్రావుకు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురుకుల పాఠశాల బాలికలు ఒలింపిక్లో పథకాలు సాధించే స్థాయికి వెళ్లాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకుల పాఠశాలల్లో చదువుకున్న వారు పోటీ పరీక్షలో విజయాలు సాధిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సంస్థ ఓఎస్డీ చంద్రకాంత్రెడ్డి, అడిషనల్ కార్యదర్శి పార్వతిదేవి, ఆర్సీఎం భీమయ్య, నిర్మల, ప్లోరిన్రాణి, రంజోల్ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ సుభాశ్రావు, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సయ్యద్ మొహినొద్దీన్, టీఆర్ఎస్ నాయకులు రంజోల్ సత్యనారాయణ, ఇజ్రాయిల్ బాబీ, నామ రవికిరణ్, వైజానాథ్, తన్వీర్, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, బాలికలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. బాలికలు ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షల్లో అధిక మార్కులు సాధించాలన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఉద్యోగ పరీక్షలు విజయం సాధించే లక్ష్యంతో ముందుకు పోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే గురుకుల పాఠశాలల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసి, నాణ్యమైన భోజనం అందిస్తున్నారన్నారు.
రంజోల్ గురుకు పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేస్తాన్నారు. సభావేదిక నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని, తాగునీటి సమస్య పరిష్కరిం చామన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతో ముఖ్యమని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. జాతీయ స్థాయిలో విజయాలు సాధించి గురుకుల పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలన్నారు.