హవేళీఘనపూర్, ఫిబ్రవరి 28 : దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని బాగుపడాలని, సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా లబ్ధ్దిదారులు వివిధ ఉపాధికి అవసరమైన వాటిని ఎంచుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని జక్కన్నపేట గ్రామంలో దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధ్దిదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ రాధాకిషన్ యాదవ్, గ్రామ సర్పంచ్ సిద్ధమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడుశ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రోటోకాల్ పాటించేలా చూడాలి
ఏడుపాయల వనదుర్గాభవానీమాత సన్నిధిలో ప్రజా ప్రతినిధులను సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో చొరవ తీసుకొని తమ ప్రోటోకాల్కు విలువ ఇచ్చే విధంగా చూడవలసిందిగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి పాపన్నపేట మండల పరిషత్ అధ్యక్షురాలు పుల్లన్నగారి ప్రశాంత్రెడ్డి కోరారు. సోమవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాచారం, గాజులగూడెం వద్ద చెక్డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సమావేశంలో పాపన్నపేటలో 30 పడకల దవాఖాన ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఎంపీపీ చందనాప్రశాంత్రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు షర్మిలా ఎంపీపీ ఉపాధ్యాక్షులు విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్లఫోరం అధ్యక్షుడు కుమ్మరి జగన్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు కుభేరుడు, కో-ఆప్షన్ సభ్యుడు గౌస్ పాపన్నపేట సొసైటీ చైర్మన్ మోహన్రెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్లు అధికారులు పాల్గొన్నారు. పాపన్నపేట మండలంలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీమాత ఆలయానికి సీఎం కేసీఆర్ రూ. వంద కోట్లు మంజూరు చేయడంపై సర్వసభ్య సమావేశం ధన్యవాదాలు తెలిపారు.